Rahul Gandhi: ప్రభుత్వం వెనక ఎవరు ఉన్నారు..? కంగనా వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్..
- కంగనా ‘‘రైతు చట్టాల’’ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఫైర్..
- ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి..
- రైతులకు వ్యతిరేకంగా కుట్ర చేస్తే అనుమతించడం..
- మళ్లీ ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యం ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది. అయితే, దీనిపై రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కంగనా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకువస్తే ఇండియా కూటమి దీనికి వ్యతిరేకంగా నిలుస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
‘‘బీజేపీ ప్రజల ఆలోచనల్ని పరీక్షిస్తూనే ఉంది. వారు ఒక ఆలోచన అందించి, దానిపై ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తుంది. బీజేపీ ఎంపీల్లో ఒకరు నల్ల చట్టాలైన రైతు చట్టాలను పునరుద్ధరించడం గురించి దీని కోసమే మాట్లాడటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఉన్నారా లేదా.? అని మోడీజీ స్పష్టం చేయండి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ ఈ రైతు చట్టాలను పునరుద్ధరిస్తారా లేదా..? ఒక వేళ అదే జరిగితే ఇండియా కూటమి మీరు వ్యతిరేకంగా నిలుస్తుందని నేను హామీ ఇస్తున్నాను. 700 మంది అమరులయ్యారు, వీరిని గుర్తుంచుకోవాలి, మోడీజీ వారి కోసం రెండు నిమిషాలు మౌనం వహించలేదు. దీనిని ఎప్పటికీ మేము మరిచిపోము’’ అని అన్నారు.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
Read Also: Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
‘‘ప్రభుత్వ విధానాలను ఎవరు నిర్ణయిస్తారు..? బీజేపీ ఎంపీ లేదా ప్రధాని మోడీ నా..? 700 మందికి పైగా రైతులు, ముఖ్యంగా హర్యానా, పంజాబ్కి చెందిన వారు బలిదానం చేసినా బీజేపీ సంతృప్తి చెందలేదు’’ అని పోస్టులో పేర్కొన్నారు. మా రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి కుట్ర చేైసినా ఇండియా కూటమి అనుమతించదని, రైతులను దెబ్బతీసేలా ఏదైనా చర్య తీసుకుంటే మరోసారి మోడీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
రైతుల నిరసనల నేపథ్యంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఈ చట్టాలను తీసుకురావాలని రైతులే డిమాండ్ చేయాలని, దేశాభివృద్ధికి రైతులే ముఖ్యమని అన్నారు. అయితే, బీజేపీ కంగనా వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పింది. ఈ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంది.
తాజావార్తలు
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Nandini : “ఆమె నా కోడలు కాదు.. కూతురు.. భట్టి సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!