ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధాని మోడీ మూడు నెలల వ్యవధిలో మూడోసారి భేటీ అయ్యారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తుండగా.. సోమవారం న్యూయార్క్లో ప్రధాని మోడీ, జెలెన్స్కీ మధ్య సమావేశం జరిగింది.
సోమవారం అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.., 'మానవత్వం యొక్క విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. ఔచిత్యానికి మెరుగుదల కీలకం' అని అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసానాయకేకి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ 'X' ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో.. సోమవారం దిసానాయక్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ భారతదేశ వృద్ధి అవకాశాలపై ఆయన ఉద్ఘాటించారు. అలాగే వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలపై చర్చించారు. మోడీ 3 రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ఆదివారం లొట్టే న్యూయార్క్ ప్యాలెస్ హోటల్లో ఈ భేటీ జరిగింది. సమాచారం ప్రకారం.. AI, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పనిచేస్తున్న…
Devi Sri Prasad – Pm MODI: ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ఎన్నారైల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ నిర్వహించిన ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడివారిని బాగా అలరించాయి.…
Modi In USA: భారతదేశానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ అమెరికాలోని ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో పర్యటిస్తున్న మోడీ ఈ రోజు న్యూయార్క్లోని నసావు కొలీజియంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. లాంగ్ ఐలాండ్లోని కొలీజయం వద్దకు ప్రధాని రాగానే ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ‘‘మోడీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’’ ఈవెంట్కి 14 వేల మంది ఎన్ఆర్ఐలు, సెలబ్రిటీలు, ఇండో అమెరికన్ కమ్యూనిటీ తరలించి వచ్చింది. ‘‘భారత్ మాతాకీ…
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీ పొత్తుపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ప్రతిస్పందించారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ,హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు ఇటీవల మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎన్సీ కూటమి పాకిస్తాన్ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుందని ఆరోపించారు.
ఈ నెల 26న జనసేనలోకి భారీగా చేరికలు.. ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు పార్టీలో చేరుతారు అని…
Indus Water Treaty: దాయాది దేశం, ఉగ్రవాదుల ఉత్పత్తి కర్మాగారంగా ఉన్న పాకిస్తాన్కి భారతదేశం మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘‘సింధు జల ఒప్పందాన్ని’’ సమీక్షించాలని పాకిస్తాన్కి నోటీసులు పంపింది. ప్రజల ఆందోళనలు, జనాభా మార్పులు, పర్యావరణ సమస్యలు, శక్తి అవసరాలకు అనుగుణంగా సమీక్షించాలని నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ పదేపదే భారత్ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న తరుణంలో ఈ చర్య వచ్చింది.
ప్రపంచ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ స్నేహం గురించి తరచూ చర్చిస్తుంటాం. ప్రధాని మోడీ వ్యక్తిగత స్థాయిలో ప్రపంచస్థాయి నేతలతో కనెక్ట్ అవుతారని, తన జీవిత అనుభవాలను కూడా సులభంగా పంచుకుంటారని సమావేశాల్లో పీఎంతో పాటు వచ్చే అధికారులు చెబుతున్నారు.