Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర భయాందోళనకర పరిస్థితి ఎదురైంది. ప్రయాణంలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా తీవ్రమైన ‘టర్బులెన్స్’ (గాల్లో ఒత్తిడి మార్పుల వల్ల వచ్చే తీవ్రమైన కుదుపులు)కు గురైంది. ఈ ప్రక్రియలో విమానం హఠాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోవడంతో ప్రయాణికులు, కేబిన్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ అనుకోని సంఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు కేబిన్ క్రూ సిబ్బంది గాయపడ్డారు.
అసలేం జరిగింది?
ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న AI2379 విమానం (VT-EXO) గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా తీవ్రమైన టర్బులెన్స్కు లేదా అప్డ్రాఫ్ట్-డౌన్డ్రాఫ్ట్కి లోనైంది. దీని ప్రభావంతో విమానం ఎత్తులో అకస్మాత్తుగా మార్పు వచ్చి, ఏకంగా 300 అడుగులు కిందకు జారిపోయింది. ఈ సమయంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో విమానంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురై, నియంత్రణ కోల్పోయి పడిపోయారు. అయితే, పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పి, సురక్షితంగా ఢిల్లీ వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.
Also Read
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- CM Chandrababu: తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారు.. ఎప్పుడూ రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు!
- Mansukh Mandaviya: 12 ఏళ్లలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలుసా? క్లారిటీ ఇచ్చిన మంత్రి..
- Kakinada Theft: కాకినాడలో విచిత్ర దొంగతనం.. క్షమాపణ లేఖ రాసి బంగారం తిరిగిచ్చిన యువకులు.. చివరకు!
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అత్యవసర సహాయం
ఈ ఘటన గురించి సమాచారం అందగానే ఢిల్లీ విమానాశ్రయ అధికారులను ముందే అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికే మెడికల్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లను సిద్ధంగా ఉంచారు. విమానం సురక్షితంగా రన్ వే పై దిగగానే వైద్య బృందాలు ప్రయాణికులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన ప్రథమ చికిత్సను అందించాయి. బాధితులకు వచ్చినవి స్వల్ప గాయాలేనని ఎయిర్ లైన్స్ వెల్లడించింది.
ఎయిర్ ఇండియా స్పందన, విచారణ
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారికంగా స్పందిస్తూ.. ప్రయాణికుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. టర్బులెన్స్ కారణంగా విమానం ఎత్తులో తాత్కాలిక మార్పు వచ్చిందని, కొంతమందికి స్వల్ప గాయాలైనప్పటికీ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుందని తెలిపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, టర్బులెన్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో విశ్లేషిస్తామని పేర్కొంది.
అసలు ‘టర్బులెన్స్’ అంటే ఏంటి?
విమాన ప్రయాణ సమయంలో గాలి ఒత్తిడి, వేగంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల ‘టర్బులెన్స్’ ఏర్పడుతుంది. దీనివల్ల విమానం బలంగా ఊగడం లేదా ఎత్తులో తీవ్రమైన మార్పులు రావడం జరుగుతుంది. ఇలాంటి ఊహించని పరిస్థితుల నుంచి రక్షణ పొందేందుకు ప్రయాణికులు విమానంలో ఉన్నంతసేపు సీట్ బెల్ట్ ధరించడమే అత్యంత సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
CM Chandrababu: తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారు.. ఎప్పుడూ రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు!
-
Mansukh Mandaviya: 12 ఏళ్లలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలుసా? క్లారిటీ ఇచ్చిన మంత్రి..
-
Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
ట్రెండింగ్
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
-
ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
-
Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!