PM Modi:రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్న ను ఏదోరకంగా మూసేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన. కూటమి సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ను ప్రవేటీకరించను అని చెప్తున్నాడు.. కానీ, ఇది మాటలకే పరిమితం, తప్ప చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్లు GST చెల్లిస్తోంది.. ఇప్పుడు షరతులతో కూడి 500 కోట్లు ఇస్తామని చెప్పడం తెలుగు ప్రజలును అవమానించడమే…
PM Modi: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫేజ్-1లో రికార్డు స్థాయిలో 60.21 ఓటింగ్ నమోదైందని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు (గురువారం) ప్రశంసించారు. అలాగే, కాశ్మీర్ లో 50వేల మంది డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి స్కూళ్లకు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.
JP Nadda: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్- బీజేపీల మధ్య వివాదం ముదురుతుంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాసిన లేఖలో మోడీని విమర్శిస్తే మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడ్డం లేదు అని ప్రశ్నించారు.
PM AASHA: రైతులకు మెరుగైన ధరలను అందించడానికి, వినియోగదారులకు నిత్యావసర వస్తువుల ధరలలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రూ. 35,000 కోట్లతో ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-AASHA) పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం రైతులకు లాభదాయకమైన ధరలను అందించడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ 2025-26…
ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పీఎం-ఆశా పథకం కోసం రూ. 35,000 కోట్లను ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రైతు సోదర సోదరీమణులకు సరసమైన ధరలకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేందుకు, 2024 రబీ సీజన్కు పోషకాల ఆధారిత సబ్సిడీ ధరలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్కు బీఎస్పీ అధినేత మాయావతి జై కొట్టారు. మోడీ 3.0 సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు తీసుకురానున్నారు.
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది.
Viksit Bharat Fellowship: బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వికాస్ భారత్ ఫెలోషిప్ను ప్రకటించింది. ఈ ఫెలోషిప్ ద్వారా, అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులు, అనుభవజ్ఞులైన, అసాధారణ నిపుణులు, విద్యావేత్తలు, నిపుణులను శక్తివంతం చేయడం లక్ష్యంగా వికాస్ భారత్ ఫెలోషిప్ మొత్తం 25 ఫెలోషిప్లను అందిస్తుంది. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఫెలోషిప్ నాన్-ఫిక్షన్ పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, పిల్లల సాహిత్యం, కాఫీ టేబుల్ పుస్తకాలతో…