CM Chandrababu: జమిలీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలు మాత్రం అప్పుడే..!
- జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు..
- జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే..
- ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: జమిలీ ఎన్నికలపై కేంద్ర వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది.. ఇప్పటికే కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఎల్లుండి పార్లమెంట్ ముందుకు రాబోతోంది జమిలీ ఎన్నికల బిల్లు.. అయితే, ఈ నేపథ్యంలో.. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటున్నారు.. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అని గుర్తుచేశారు.. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని దుయ్యబట్టారు.. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి.. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని సెటైర్లు చేశారు.
Read Also: Bihar: బీహార్లో మావోల దుశ్చర్య..? రెండు జేసీబీలతో సహా 6 వాహనాలు దగ్ధం
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇక, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు సీఎం చంద్రబాబు.. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆయన.. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతీ చోటా దీనిపై చర్చ జరగాలన్నారు.. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి.. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయన్నారు.. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుంది.. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్నారు.. భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టం చేశారు..
Read Also: Allu Arjun Wife: భావోద్వేగానికి గురి అయిన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఈ సారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తాం.. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా.. ప్రశ్నలు- సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తాం అని పేర్కొన్నారు.. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి.. వాటిపై సమాధానాలు కోరతాం.. తద్వారా సమయాన్ని సద్వినియోగం జరగటంతో పాటు మంత్రులు- అధికారుల మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుందన్నారు.. మరోవైపు.. ఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.. అద్వాణీతో నాకు దశాబ్దాల కాలం నుంచి అనుబంధం ఉంది.. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎల్కే అద్వానీ సహకారం మరువలేనిది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!