Uddhav Thackeray: ‘‘ఆపరేషన్ లోటస్’’.. మోడీని కలవనున్న ఉద్ధవ్ ఎంపీలు..
- ఉద్ధవ్ ఠాక్రేకి భారీ షాక్ తప్పదా..?
- ప్రధాని మోడీతో ఠాక్రే వర్గం ఎంపీల భేటీ..
- శరద్ పవార్ ఎంపీలు కూడా టచ్లో ఉన్నట్లు వార్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి 233 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. విపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణ పరాజయం పాలైంది. ఈ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఉద్ధవ్ శివసేన 20, ఎన్సీపీ శరద్ పవార్ 10, కాంగ్రెస్ 16 సీట్లను గెలుచుకుంది.
అయితే, ఈ పరాజయం తర్వాత విపక్ష కూటమి ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వైపు చూస్తున్నారు. బీజేపీ ‘‘ఆపరేషన్ లోటస్’’ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన (యూబీటీ) ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రధాని మోడీని వీరంతా కలవనున్నారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Pawan Kalyan: ఐక్యమత్యం పై పవన్ కళ్యాణ్ ట్వీట్.. అల్లు అర్జున్ అరెస్ట్ గురించేనా?
గత వారం, ఠాక్రే వర్గం ఎంపీలు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరగా, మంజూరు కాలేదు. గురువారం కూడా వారి అభ్యర్థన తిరస్కరించబడింది. అయితే, డిసెంబర్ 16 సోమవారం రోజు ప్రధానితో వీరి భేటీ షెడ్యూల్ అయింది. అయితే, ఈ సమావేశం ఖచ్చిత ఉద్దేశ్యం తెలియకున్నా.. ఏదో పెద్దగా జరగబోతుందని తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ఓటమి తర్వాత వీరంతా మోడీని కలవనుండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలోని , ఇటూ మహారాష్ట్రలోనూ బీజేపీనే అధికారంలో ఉండటం, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రభావం చూపించపోవడాన్ని పరిశీలిస్తే, వీరంతా బీజేపీ సర్కార్కి కేంద్రంలో మద్దతు తెలిపే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శరద్ పవార్ ఎన్సీపీ ఎంపీలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్తుల వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!