Maharashtra Cabinet: ‘మహా’ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు..! సాయంత్రం మోడీతో ఫడ్నవిస్ భేటీ
- శనివారం మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ..!
- సాయంత్రం మోడీతో సీఎం ఫడ్నవిస్ భేటీ
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కూడా సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడింది. డిసెంబర్ 14న (శనివారం) మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ సీనియర్ నేత వెల్లడించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి దేవేంద్ర ఫడ్నవిస్ హస్తినకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్లను కలవనున్నారు. అలాగే ప్రధాని మోడీతో కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Atul Subhash Suicide: సంచలనంగా టెక్కీ సూసైడ్ కేస్.. వరకట్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం చాలా గందరగోళం జరిగింది. దాదాపు ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మరోసారి ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని, బీహార్ ఫార్ములా అమలు చేయాలని శివసేన పట్టుపట్టింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అయింది. మొత్తానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రంగంలోకి దిగాక పరిస్థితులు చక్కబడ్డాయి.
ఇది కూడా చదవండి: C-Section Delivery Back Pain: సి-సెక్షన్ డెలివరీ వెన్నునొప్పికి దారి తీస్తుందా? నిజమెంత?
డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం కేబినెట్ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. అయితే హోంమంత్రి శాఖను శివసేన అడుగుతోంది. దీనిపై బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక 7:7:7 నిష్పత్తిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీకి కేబినెట్ పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఫడ్నవిస్ ఏ విధంగా మంత్రివర్గ విస్తరణ చేస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Back Pain: నడుమునొప్పితో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!