Rahul Gandhi: ఆ రెండు విషయాలు లేవనెత్తుతాననే లోక్సభలో మాట్లాడనివ్వలేదు
- ట్రంప్ బెదిరింపులతోనే అమెరికాతో డీల్
- ఆ రెండు విషయాలు లేవనెత్తుతాననే లోక్సభలో మాట్లాడనివ్వలేదు
- కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ బెదిరింపులతోనే అమెరికాతో ప్రధాని మోడీ వాణిజ్య ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేరళంలోని కన్నూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
‘‘అమెరికన్ రైతులు భారతదేశంలో సోయాబీన్, మొక్కజొన్న, పండ్లను అమ్మడానికి అనుమతించడం ఏ భారతీయ ప్రధానమంత్రి కూడా ఇలా అనుమతించరు. భారతదేశ పునాదిని బీజేపీ నాశనం చేయబోతోంది. 4 నెలలుగా భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయింది. భారత ప్రభుత్వం.. అమెరికన్ కంపెనీలకు భారత వ్యవసాయాన్ని తెరవడానికి ఇష్టపడలేదు. కానీ అధ్యక్షుడు ట్రంప్.. ప్రధానమంత్రి మోడీని బెదిరించారు. దీంతో లొంగిపోయారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై వారు నన్ను మాట్లాడనివ్వలేదు. అమిత్ షా లేచారు. ప్రధానమంత్రి మోడీ నన్ను మాట్లాడనివ్వలేదు. స్పీకర్ కూడా అదే చేశారు. భారత చరిత్రలో మొదటిసారిగా ప్రతిపక్ష నేతను రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడనివ్వలేదు. వారు నన్ను ఎందుకు ఆపారు? ఎందుకంటే భారత ప్రధాని మోడీ చిక్కుకున్న రెండు సమస్యల గురించి నేను మాట్లాడబోతున్నానని వారికి తెలుసు. ఎప్స్టీన్ ఫైల్స్, అమెరికాలో అదానీ కేసు గురించి.’’ అని అన్నారు.
Also Read
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
‘‘అదానీ సాధారణ కంపెనీ కాదు. అదానీ బీజేపీకి, భారత ప్రధానమంత్రికి ఆర్థిక మౌలిక సదుపాయాలు. మోడీకి ముప్పు చాలా స్పష్టంగా ఉంది.’’ అని అన్నారు.
#WATCH | Keralam | Addressing at an event in Kannur, LoP-Lok Sabha & Congress MP Rahul Gandhi says, "Adani is not a normal company. Adani is the financial infrastructure of the BJP and the Prime Minister of India…The threat to the Prime Minister is very clear- that if you do… pic.twitter.com/TdEaa4yAKd
— ANI (@ANI) February 26, 2026
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!