Deve Gowda: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయమా.?? అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని, ఇది దేశ ప్రజల ఆస్తి, ఇది వ్యక్తిగత విషయం కాదని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాక్యలు చేశారు.