పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్..
Pawan Kalyan : పిఠాపురంలో జనసేన ఆవిర్భావ 12వ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా హిందీ భాష, సనాతన ధర్మం, ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టడంపై మాట్లాడారు. భారత్ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టొద్దు అంటూ తేల్చి చెప్పారు. మనమంతా ఇండియన్లుగా గర్వించాలన్నారు. ఎప్పటికీ ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడిపోతాం అని ఎవరికి వారు మాట్లాడితే ఎలా..…
Pawan Kalyan : పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అట్టహాసంగా సాగుతోంది. ఈ సభలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తాను ఒక్కడిగా 2014లో జనసేన ప్రయాణం మొదలు పెట్టానని.. ఈ రోజు ఈ స్థాయి దాకా వచ్చామంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం ముందు తమిళంలో ఒక పద్యం పాడారు. భయం లేదు కాబట్టే ఎవరికీ భయపడకుండా ఈ స్థాయి దాకా ఎదిగామంటూ దాని అర్థం…
Nadendla Manohar : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ నేతగా ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పవన్ ఒకేలా ఉన్నారన్నారు. పవన్ కల్యాన్ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా అందరికన్నా ముందుగా స్పందించారని.. ఇక ముందు కూడా అలాగే ఉంటారంటూ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలు పడి పార్టీని ఈ స్థాయికి తెచ్చారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే…
జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా నేడు కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు..
Janasena : పిఠాపురంలో ఈ రోజు జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభ పైనే అదరి దృష్టి ఉంది. పిఠాపురంలో జరుగుతున్న సభకు వెళ్లడానికి అన్ని దారుల్లో జనసైనికులు బయలు దేరుతున్నారు. అయితే సభ దగ్గర మాత్రం మూడు దారులు పెట్టారు. ఈ మూడు దారుల నుంచే సభకు చేరుకోవాలి. ఒక్కో దారిలో ఒక్కొక్కరికి పర్మిషన్ ఇచ్చారు. ఇందులో చూసుకుంటే రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలకు మాత్రమే వెళ్లాలి. వీరు ఇక్కడ…
జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండగ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేస్తోంది ఆ పార్టీ.. శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇవాళ్టి సభను సక్సెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు..
పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరిగే సభ కావడంతో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అన్నారు.. రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు.. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ ఆవిర్భావ సభ ఉద్దేశని వెల్లడించారు..