Mani Shankar Aiyar: నువ్వు చాలు సామి, కాంగ్రెస్ను ముంచనీకి..
- కాంగ్రెస్పై మణిశంకర్ అయ్యర్ విమర్శలు..
- కేరళ ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ గెలుస్తుందన్న కాంగ్రెస్ నేత..
- కాంగ్రెస్ సీనియర్లపై విమర్శలు, సీఎం విజయన్పై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Shankar Aiyar: కాంగ్రెస్ను నాశనం చేయడానికి ఎవరూ అక్కర లేదు, వాళ్ల పార్టీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఖతం చేసే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో ముందు వరసలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పారేశాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుల్లో ఎన్నికల్లు జరగబోతున్నాయి. ఇందులో కేరళలో మాత్రమే కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి.
Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
Also Read
- PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాను ‘‘కీలు బొమ్మ’’గా, శశి థూరూర్ను ‘‘పాకిస్తాన్ వ్యతిరేకి’’, ‘‘తదుపరి విదేశాంగ మంత్రి’’ కావాలనే ఆశ ఉందని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్ను కూడా ఆయన ఎగతాళి చేస్తూ, “తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి” అని అన్నారు. ఇదే కాకుండా కేరళలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతం అవుతున్న తరుణంలో.. ‘‘రాబోయే ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సీఎం పినరయి విజయన్ మంచి పనులు చేస్తున్నారు’’ అని కితాబు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలవలేదని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన “విజన్ 2031: డెవలప్మెంట్ అండ్ డెమోక్రసీ” సెమినార్లో, అయ్యర్ కేరళ ముఖ్యమంత్రి మరియు సీపీఎం నాయకుడు పినరయి విజయన్ను ప్రశంసించారు.
దీని తర్వాత, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. పవన్ ఖేరా X లో మాట్లాడుతూ, ‘‘మణి శంకర్ అయ్యర్కు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్తో ఎటువంటి సంబంధం లేదు. ఆయన పూర్తిగా వ్యక్తిగత సామర్థ్యంతోనే మాట్లాడతారు’’ అని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని,ఎల్డీఎఫ్-బీజేపీలు రహస్య భాగస్వాములు అని జైరాం రమేష్ అన్నారు.
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!