Mani Shankar Aiyar: నువ్వు చాలు సామి, కాంగ్రెస్ను ముంచనీకి..
- కాంగ్రెస్పై మణిశంకర్ అయ్యర్ విమర్శలు..
- కేరళ ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ గెలుస్తుందన్న కాంగ్రెస్ నేత..
- కాంగ్రెస్ సీనియర్లపై విమర్శలు, సీఎం విజయన్పై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Shankar Aiyar: కాంగ్రెస్ను నాశనం చేయడానికి ఎవరూ అక్కర లేదు, వాళ్ల పార్టీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఖతం చేసే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో ముందు వరసలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పారేశాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుల్లో ఎన్నికల్లు జరగబోతున్నాయి. ఇందులో కేరళలో మాత్రమే కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి.
Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాను ‘‘కీలు బొమ్మ’’గా, శశి థూరూర్ను ‘‘పాకిస్తాన్ వ్యతిరేకి’’, ‘‘తదుపరి విదేశాంగ మంత్రి’’ కావాలనే ఆశ ఉందని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్ను కూడా ఆయన ఎగతాళి చేస్తూ, “తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి” అని అన్నారు. ఇదే కాకుండా కేరళలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతం అవుతున్న తరుణంలో.. ‘‘రాబోయే ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సీఎం పినరయి విజయన్ మంచి పనులు చేస్తున్నారు’’ అని కితాబు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలవలేదని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన “విజన్ 2031: డెవలప్మెంట్ అండ్ డెమోక్రసీ” సెమినార్లో, అయ్యర్ కేరళ ముఖ్యమంత్రి మరియు సీపీఎం నాయకుడు పినరయి విజయన్ను ప్రశంసించారు.
దీని తర్వాత, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. పవన్ ఖేరా X లో మాట్లాడుతూ, ‘‘మణి శంకర్ అయ్యర్కు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్తో ఎటువంటి సంబంధం లేదు. ఆయన పూర్తిగా వ్యక్తిగత సామర్థ్యంతోనే మాట్లాడతారు’’ అని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని,ఎల్డీఎఫ్-బీజేపీలు రహస్య భాగస్వాములు అని జైరాం రమేష్ అన్నారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!