Mani Shankar Aiyar: నువ్వు చాలు సామి, కాంగ్రెస్ను ముంచనీకి..
- కాంగ్రెస్పై మణిశంకర్ అయ్యర్ విమర్శలు..
- కేరళ ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ గెలుస్తుందన్న కాంగ్రెస్ నేత..
- కాంగ్రెస్ సీనియర్లపై విమర్శలు, సీఎం విజయన్పై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Shankar Aiyar: కాంగ్రెస్ను నాశనం చేయడానికి ఎవరూ అక్కర లేదు, వాళ్ల పార్టీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఖతం చేసే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో ముందు వరసలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పారేశాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుల్లో ఎన్నికల్లు జరగబోతున్నాయి. ఇందులో కేరళలో మాత్రమే కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి.
Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాను ‘‘కీలు బొమ్మ’’గా, శశి థూరూర్ను ‘‘పాకిస్తాన్ వ్యతిరేకి’’, ‘‘తదుపరి విదేశాంగ మంత్రి’’ కావాలనే ఆశ ఉందని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్ను కూడా ఆయన ఎగతాళి చేస్తూ, “తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి” అని అన్నారు. ఇదే కాకుండా కేరళలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతం అవుతున్న తరుణంలో.. ‘‘రాబోయే ఎన్నికల్లో మళ్లీ లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సీఎం పినరయి విజయన్ మంచి పనులు చేస్తున్నారు’’ అని కితాబు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలవలేదని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన “విజన్ 2031: డెవలప్మెంట్ అండ్ డెమోక్రసీ” సెమినార్లో, అయ్యర్ కేరళ ముఖ్యమంత్రి మరియు సీపీఎం నాయకుడు పినరయి విజయన్ను ప్రశంసించారు.
దీని తర్వాత, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. పవన్ ఖేరా X లో మాట్లాడుతూ, ‘‘మణి శంకర్ అయ్యర్కు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్తో ఎటువంటి సంబంధం లేదు. ఆయన పూర్తిగా వ్యక్తిగత సామర్థ్యంతోనే మాట్లాడతారు’’ అని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని,ఎల్డీఎఫ్-బీజేపీలు రహస్య భాగస్వాములు అని జైరాం రమేష్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!