The Kerala Story 2: కేరళ స్టోరీని వ్యతిరేకిస్తూ “గొడ్డు మాంసం”తో నిరసన
- ప్రకంపనలు సృష్టిస్తున్న కేరళ స్టోరీ..
- కేరళ వ్యాప్తంగా కమ్యూనిస్టుల నిరసనలు..
- బీఫ్, పరోటాతో నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story 2:‘‘ ది కేరళ స్టోరీ2’’ విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేరళలో ఈ సినిమా వివాదంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సహా సీపీఎం, ఇతర కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేరళ వ్యాప్తంగా సీపీఎం యువజన విభాగం DYFI, స్టూడెంట్ వింగ్ SFI తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తగా నిరసనలు చేపట్టారు. రాజధాని తిరువనంతపురంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. పరోటా, గొడ్డు కూరను వడ్డిస్తూ నిరసన తెలిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఆగ్రహానికి కారణమైంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించి ‘‘ది కేరళ స్టోరీ 2’’ ఫిబ్రవరి 27న విడుదల కానుంది. కేరళలో హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఇస్లాంలోకి మతమార్పిడి చేస్తు్న్నారనే ఆరోపణ మీద ఈ సినిమాను రూపొందించారు. అయితే, ఈ సినిమా కేరళ ప్రతిష్టను దెబ్బతీస్తోందని, ఇలాంటివి కేరళలో జరగవని సీపీఎం, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఇటీవల సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి, లౌకికవాదాన్ని దెబ్బతీయడానికి ఈ సినిమా రూపొందించారని ఆరోపించారు. కేరళలో అభివృద్ధి, శాంతి భద్రతలు కాపాడుకోవడంలో ముందుందని, ఈ సినిమా కేరళను ఉగ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని, దీనిని సమిష్టిగా తిరస్కరించాని విజయన్ అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ కూడా ఈ సినిమాను విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు గొడ్డు మాంసం తినాల్సి వస్తుందని తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని, మతపరంగా ప్రజల్ని విభజిస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..