Pinarayi Vijayan: కేంద్రానికి కేరళ సీఎం లేఖ.. వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
- కేంద్రానికి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
- వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
- జనవరి 30న బెంగళూరులో సీజే.రాయ్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 30న బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ సోదాల సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, రియాల్టీ షోల నిర్వాహకుడు సీజే. రాయ్ మరణంపై న్యాయ విచారణ జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు.
ఈ సంఘటన ‘దేశ పన్ను పరిపాలనపై మచ్చ’’గా అభివర్ణించారు. సోదాల సమయంలో జరిగిన విధానపరమైన లోపాల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నప్పుడు రాయ్ ఎలా లోడ్ చేసిన తుపాకీని పొందగలిగారని ప్రశ్నించారు. ‘‘ప్రోటోకాల్ యొక్క తీవ్రమైన వైఫల్యం.’’గా పేర్కొన్నారు.
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఐటీ అధికారులు వేధించారని రాయ్ సోదరుడు చేసిన ప్రకటనలను గుర్తుచేశారు. ఐటీ అధికారులు కుటుంబాన్ని వేధించారని చేసిన ఆరోపణలను కూడా సీఎం హైలైట్ చేశారు. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని నిష్పాక్షిక న్యాయ విచారణ మాత్రమే పూర్తి సత్యాన్ని బయటకు తీసుకురాగలదని చెప్పారు. కర్ణాటక పోలీసుల దర్యాప్తును అంగీకరిస్తున్నామని.. పరిపాలనా విధానాలు, తగిన శ్రద్ధ, అధికారుల ప్రవర్తనను పరిశీలించడానికి విస్తృత దర్యాప్తు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఆలస్యం లేకుండా విచారణకు ఆదేశించాలని.. కాలపరిమితి నివేదికను సమర్పించాలని కేంద్రాన్ని కోరారు.
అసలేం జరిగిందంటే..
శుక్రవారం బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. అదే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లైసెన్స్డ్ తుపాకీతో ఛాతీలో కాల్చుకుని సీజే.రాయ్ ప్రాణాలు తీసుకున్నారు. సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీజే రాయ్కు భార్య లిని రాయ్, కుమారుడు రోహిత్, కుమార్తె రియా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా విదేశాల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అశోక్నగర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kerala Chief Minister Pinarayi Vijayan has written to Union Finance Minister Nirmala Sitharaman seeking a judicial inquiry into the death of C.J. Roy, Chairman of the Confident Group, who died by suicide during an Income Tax search in Bengaluru on January 30.
In the letter, the…
— ANI (@ANI) February 2, 2026
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!