Pinarayi Vijayan: కేంద్రానికి కేరళ సీఎం లేఖ.. వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
- కేంద్రానికి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
- వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
- జనవరి 30న బెంగళూరులో సీజే.రాయ్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 30న బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ సోదాల సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, రియాల్టీ షోల నిర్వాహకుడు సీజే. రాయ్ మరణంపై న్యాయ విచారణ జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు.
ఈ సంఘటన ‘దేశ పన్ను పరిపాలనపై మచ్చ’’గా అభివర్ణించారు. సోదాల సమయంలో జరిగిన విధానపరమైన లోపాల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నప్పుడు రాయ్ ఎలా లోడ్ చేసిన తుపాకీని పొందగలిగారని ప్రశ్నించారు. ‘‘ప్రోటోకాల్ యొక్క తీవ్రమైన వైఫల్యం.’’గా పేర్కొన్నారు.
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఐటీ అధికారులు వేధించారని రాయ్ సోదరుడు చేసిన ప్రకటనలను గుర్తుచేశారు. ఐటీ అధికారులు కుటుంబాన్ని వేధించారని చేసిన ఆరోపణలను కూడా సీఎం హైలైట్ చేశారు. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని నిష్పాక్షిక న్యాయ విచారణ మాత్రమే పూర్తి సత్యాన్ని బయటకు తీసుకురాగలదని చెప్పారు. కర్ణాటక పోలీసుల దర్యాప్తును అంగీకరిస్తున్నామని.. పరిపాలనా విధానాలు, తగిన శ్రద్ధ, అధికారుల ప్రవర్తనను పరిశీలించడానికి విస్తృత దర్యాప్తు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఆలస్యం లేకుండా విచారణకు ఆదేశించాలని.. కాలపరిమితి నివేదికను సమర్పించాలని కేంద్రాన్ని కోరారు.
అసలేం జరిగిందంటే..
శుక్రవారం బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. అదే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లైసెన్స్డ్ తుపాకీతో ఛాతీలో కాల్చుకుని సీజే.రాయ్ ప్రాణాలు తీసుకున్నారు. సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీజే రాయ్కు భార్య లిని రాయ్, కుమారుడు రోహిత్, కుమార్తె రియా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా విదేశాల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అశోక్నగర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kerala Chief Minister Pinarayi Vijayan has written to Union Finance Minister Nirmala Sitharaman seeking a judicial inquiry into the death of C.J. Roy, Chairman of the Confident Group, who died by suicide during an Income Tax search in Bengaluru on January 30.
In the letter, the…
— ANI (@ANI) February 2, 2026
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!