బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్! అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు వైసీపీ జెడ్పీటీసీలు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని నలుగురు జెడ్పీటీసీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను…
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిశారు. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మాధవ్కు పవన్ శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు. ఈ భేటీలో ఇద్దరు పలు కీలక రాజకీయ అంశాలపై చర్చించారు. కూటమి కార్యాచరణ, ప్రభుత్వంలో భాగస్వామ్యం, రాజకీయ సమన్వయంపై నేతలు చర్చించారు. జనసేన–బీజేపీ మిత్రపక్షాల మధ్య సమన్వయం పెంచే…
సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ జరగనుంది.. రాజధాని లో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనుంది.. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్కు అనుమతి ఇవ్వనుంది కేబినెట్..
మొత్తనికి అనేక వాయిదాలు, అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. అప్పటివరకు ఎదో అలా అలా ఉన్న బజ్ కాస్త ట్రైలర్ తర్వాత పెరిగింది. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కూడా డిమాండ్ ఏర్పడింది. అదే అదనుగా కాస్త రేట్లు పెంచి మరి బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం. అయితే హరిహర వీరమల్లు భారీ…
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగ రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. Also…
HHMV : పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది, అలాగే పండుగ సాయన్న జీవిత చరిత్రను పుస్తక రూపంలో రచించిన బెక్కెం జనార్దన్ ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న జీవితంలోని సంఘటనలను చిత్రీకరిస్తామంటూ ప్రకటించి, ఇప్పుడు…
త్వరలో ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిధి అగర్వాల్, తాజాగా ‘ఆస్క్ నిధి’ అంటూ ట్విట్టర్లో ఫ్యాన్ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఒక అభిమాని, “బంగారం, మీ అమ్మగారి నంబర్ ఇస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను, ప్లీజ్ ఇవ్వచ్చుగా?” అంటూ కామెంట్ చేయగా, దానికి ఆమె, “అవునా, నాటీ!” అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది. Also Read:Nidhhi Agerwal: అగర్వాల్స్ ఏం తింటే ఇంత అందంగా ఉంటారో తెలుసా ?…