యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాను ‘ప్రభాస్ 20’ పేరుతో 2018 సెప్టెంబర్ 5న ప్రారంభించారు. సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఒకానొక సమయంలో ప్రభాస్ అభిమానులు సినిమా ఇంకెంతకాలం తీస్తారంటూ మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మరికొంత మంది సెటైర్లు పేల్చారు. ఏదైతేనేం మొత్తానికి సినిమా…
విజయవాడలోని జనసేన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల జనసేన అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని.. వీటి మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రమదానం ద్వారా రోడ్ల మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం…
ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయబోతున్నట్టు నిర్మాత, నటుడు గణేష్ ప్రకటించారు. సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామితో ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గణేశ్. నటుడిగా పేరు సంపాదించిన తర్వాత బండ్ల గణేష్ నిర్మాణ రంగంలోకి దిగాడు. ‘తీన్ మార్, ఆంజనేయులు, గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్’ వంటి సినిమాలను నిర్మించాడు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయ ప్రయాణం కూడా సాగించాడు. అయితే…
యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో తమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన ఫ్యాన్ మూమెంట్ ను చాటుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ “సర్కారు వారి పాట” మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ బార్సిలోనాలో జరుగుతోంది. థమన్ కూడా బార్సిలోనాలో ‘సర్కారు వారి పాట’ టీమ్తో కలసి సందడి చేస్తున్నాడు. తమన్ నిన్న రాత్రి…
ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ విడుదల కాగా మరోవైపు ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో ‘భీమ్లానాయక్’ సినిమా ఒకటి. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో ‘భీమ్లానాయక్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.…
ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నవంబర్ 1 నుంచి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుమల వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. Read Also: టీడీపీ ఎంపీ కేశినేని నాని…
కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇది డిమాండ్ కాదు… ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తరవాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుందని… అధికార మార్పిడి తర్వాత ‘దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా’గా పేరుగా మారుస్తామన్నారు. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు.. సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమేనని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజా షెడ్యూల్ లో పవన్, రానాలపై ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ లు కలిసి తీసుకున్న పిక్స్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు…
టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా దీక్ష చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, బాబు దీక్షపై సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అంటూ కామెంట్ చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి.. 36 గంటలు కాదు.. 12 గంటలు కూడా ఆయన దీక్ష చేయలేరన్నారు. కేవలం అధికారం రాలేదనే సీఎం వైఎస్ జగన్ను పట్టుకుని నానా మాటలు అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు దీక్ష అంటేనే దొంగ దీక్ష అని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ అనంతరం సినిమాలను దూరం పెట్టిన పవన్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ‘వకీల్ సాబ్’తో పాటు ఆయన వరుసగా మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్…