‘భీమ్లా నాయక్’తో బ్లాస్ట్ ఖాయమంటున్న నాగవంశీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ఈ మూవీని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు తమన్ అందించిన గీతాలు చార్ట్ బస్టర్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే లాలా భీమ్లా పాట వీడియో రష్ చూశాను. అబ్బాయిలూ గుర్తు పెట్టుకోండి… 2022 జనవరి 12న థియేటర్లలో బ్లాస్ట్ ఖాయం’ అని పేర్కొన్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, మురళీశర్మ, సముతిరకని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?