Ambati Rambabu: యువశక్తి సభ వేదికగా మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సంబరాల రాంబాబు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అంబటి రాంబాబు.. నన్ను టార్గెట్ చేస్తే నేలకు కొట్టిన బంతిలా ఎగిరి పడతానన్న ఆయన.. జనసేన నాపై బురద చల్లడం ఇంతటితో ఆగదు.. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు.. అయినా నేను భయపడను, నేను…
Vellampalli Srinivas: రణస్థలం వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీపై చేసిన కామెంట్లకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు.. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… పవన్ కల్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది అని వ్యాఖ్యానించారు.. తన పార్టీ కార్యకర్తలను నమ్మలేని వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు.. పవన్ ఇప్పటికైనా జనసేన పార్టీ మూసేయాలని సలహా ఇచ్చారు. పార్టీ మూసివేసి…
రణస్థలం వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన యువశక్తి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. ఓ వైపు ఒంటరిగానైనా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. మరోవైపు అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.. ఇది మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల సీఎం అంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు.. చంద్రబాబు చెప్పాలనుకున్నది పవన్ నోట చెప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు.. ఇక,…
Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. రూ.1800 కోట్లు పోలాండ్కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో పవన్ కళ్యాణ్ కేంద్రం చేతికి చిక్కాడని ప్రచారం జరుగుతోందని.. రెండు మూడు నెలల నుంచి ఈ ప్రచారం సాగుతోందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు పిల్లలు చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కుంటే బాధ్యత ఆయన వహిస్తాడా అని నిలదీశారు. 2014-19 మధ్య జనసేన, టీడీపీ ప్రభుత్వంలో…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనసేన పేరును చంద్రసేనగా మార్చేస్తున్నట్టు చెప్పడానికే పవన్ సభ పెట్టాడన్నారు. సంక్రాంతి మామూళ్లు తీసుకుని రణ స్థలంలో ఒక ఈవెంట్ నిర్వహించి వెళ్లాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో రెండున్నర గంటలు దేశం గురించి మాట్లాడారంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. శీలం లేని పవన్ కళ్యాణ్ గంజాయి తాగి రణ స్థలంలో మాట్లాడాడని.. ఆంబోతు తోకకు మంట పెట్టినప్పుడు వేసినట్టు…
AppalaRaju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ పగటి వేషగాడిలా ఉన్నాడని ఆరోపించారు. గ్రామాల్లో పండగల సమయంలో పగటి వేషగాళ్లు వస్తారని.. ఇప్పుడు పవన్ కూడా అలాగే వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనంపై 2019 తర్వాత అని పవన్ మాట్లాడుతున్నాడని.. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పవన్ యజమాని చంద్రబాబు…