Pawan Kalyan: జగన్ సర్కార్పై పవన్ కౌంటర్లు.. చర్యలేంటో ఆ దేవుడికే ఎరుక ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్ ద్వారా వరుస కౌంటర్లు వేశారు.. అన్నమయ్య డ్యాం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ ట్వీట్ చేసిన పవన్.. క్లాస్ వార్ అంటూ జగన్ చేసిన కామెంట్ల మీద సెటైర్లు వేశారు.. అధికారికంగా రూ. 500 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఉన్న రిచెస్ట్ సీఎం.. నిరంతరం కార్ల్ మార్క్స్ లా క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు. కార్ల్ మార్క్స్ లాగా ‘వర్గ యుద్ధం’ జగన్ మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు.. అణచివేసే వారే.. అణచివేతకు గురైనవారిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న ఆయన.. నా కామెంట్లపై సందేహాలు ఉంటే, ఏపీ మానవ హక్కుల సంఘాలను సంప్రదించండి అని సలహా ఇచ్చారు.
Read Also: Adipurush: మళ్ళీ వివాదంలో ఆదిపురుష్.. కొంప ముంచిన కొత్త పోస్టర్!
Also Read
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వల్ల.. ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపత్తూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారని తన ట్వీట్ ద్వారా గుర్తుచూశారు పవన్.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని.. ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో తెలీదు అని ఎద్దేవా చేశారు.
Read Also: PBKS vs RR: రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య కీలక మ్యాచ్.. ఓడితే ఇంటికే.
అన్నమయ్య డ్యామ్ విషయంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలేంటో ఆ దేవుడికే ఎరుక? అని సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్.. అన్నమయ్య డ్యాంని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు.. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక.. కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు అని విమర్శలు గుప్పించారు.. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ. 660 కోట్లకు అప్పచెప్పారంటూ ఆరోపణలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
A gentle reminder to officially 500 Cr worth AP CM (Richest amongst all CMs) who constantly talks about
‘Class War’ like Karl Marx.The funny part is the ‘oppressor speaks like oppressed’.Any doubts, please check with AP Human Right Groups.• 19.11.2021 తేదీన తెల్లవారుజామున… pic.twitter.com/CwoNZqspjm
— Pawan Kalyan (@PawanKalyan) May 19, 2023
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!