Venugopala Krishna: పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venugopala Krishna Comments On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయిందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కోసమే తాను పనిచేస్తున్నాననే విషయాన్ని తన ప్రకటన ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారని తెలిపారు. దీనివల్ల ఎక్కువగా బాధపడేది జనసైనికులేనని పేర్కొన్నారు. తమకేదో న్యాయం చేస్తాడని అనుకుని జనసైనికులు పవన్కి మద్దతిచ్చారని, కానీ ఇప్పుడు ఏం చేయాలో వారికే తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
PM Kisan: వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకం.. త్వరలో14వ విడతకు మోడీ శ్రీకారం
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
దేశంలోనే అత్యంత శక్తివంతమైన కోటరీని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఎదుర్కొన్నారని చెప్పారు. వారాహిని ఎందుకు లోపల పెట్టారో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీకేష్ (నారా లోకేష్ని ఉద్దేశిస్తూ) కోసమే పవన్ ఈ పని చేసినట్లు జనసైనికులకు కూడా అర్థమైందన్నారు. పవన్ కళ్యాణ్ను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఎన్ని తప్పులు జరిగినా.. ఒక్కసారి కూడా పవన్ ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తీరుపై జనసైనికులకు కూడా స్పష్టత ఏర్పడిందని, చాలామంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. పవన్ పూర్తిగా చంద్రబాబు కోసమే పని చేస్తున్నట్టు స్పష్టం చేశారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను జనం ఏమాత్రం నమ్మే స్థితి లేదని తేల్చి చెప్పారు.
Work From Home: “వర్క్ ఫ్రం హోం” అనైతికం.. బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందన
కాగా.. ఇటీవల ఏపీలో రానున్న ఎన్నికలపై, పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులు రాజకీయంలో భాగమేనన్న ఆయన.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని.. ఆ పార్టీకి మళ్లీ ఓటు వేస్తే రాష్ట్రం ఇప్పట్లో కోలుకోలేదని విమర్శించారు. నా స్టార్డమ్తో ఒక్కరోజులోనే ఏదో అయిపోదామని తాను అనుకోలేదని, కష్టపడితే అనుకున్నది సాధించగలమనని తనకు తెలుసని అన్నారు. ఏపిలోని మెజారిటీ ప్రజలను రక్షించడానికి తాను కొంతమందికి టార్గెట్ అవుతానని, అయినా భయపడనని, అన్నింటికీ సిద్దంగానే ఉన్నానని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మన బలం ఏమిటో ముందుగా బేరీజు వేసుకోవాలన్నారు. ఇలా ఆయన చేసిన వ్యాఖ్యల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉండొచ్చని చెప్పిన పాయింట్.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి.
Bihar: జేడీయూ కార్యకర్తలకు మాంసంతో భోజనం.. కుక్కలు కనిపించడం లేదన్న బీజేపీ
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!