Parliament Terror Attack: పార్లమెంట్పై ఉగ్రవాద దాడిలో జరిగిన నేటికి 22వ వార్సికోత్సవం. ఈ ఘటన జరిగిన ఇదే రోజు మరోసారి భారత పార్లమెంట్పై మరోసారి దాడి జరిగింది. బుధవారం ఇద్దరు అగంతకులు పార్లమెంట్ లోపలకి ప్రవేశించి, ఎల్లో స్మోక్ బాంబులను విసిరారు. ఈ ఘటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. 2001లో పార్లమెంట్పై పాకిస్తాన్ ఆధారిత ఉగ్రసంస్థలు లష్కరేతోయిబా, జైషే మహ్మద్ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. ఐదుగురు…
Sabarimala : ప్రస్తుతం కేరళలోని శబరిమల ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొంతమంది యాత్రికులు దర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్.. అందులో భాగంగా తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఆ సమావేశాల అనంతరం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా విస్త్రతస్థాయి…
MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్లో డానిష్ అలీ, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనపై రమేష్ బిధూరి మతపరమైన వివక్ష, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ డానిష్ అలీ ఆరోపించారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. క్యాష్ ఫర్ క్వేరీగా చెప్పబడుతున్న ఈ కేసులో ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మోయిత్రాను విచారించింది. తాజాగా ఈ రోజు ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. ప్యానెట్ మొదటి నివేదికను ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ సమర్పించారు.
క్యాష్ ఫర్ క్వరీ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫారసు చేసిన ఎథిక్స్ కమిటీ నివేదిక ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ నెల 4న ఈ అంశాన్ని అజెండాలో ఉంచినా చర్చించలేదు.. మొయిత్రా సస్పెన్షన్ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకొనే ముందు చర్చ జరపాలని పలువురు విపక్ష సభ్యులు కోరుతున్నారు.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారని, క్యాఫ్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. మెజారిటీ సభ్యులు ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంట్ ముందుకు ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు రాబోతున్నట్లు సమాచారం. ఈ నివేదికపై డివిజన్ ఓట్లు అడగాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే ఈ నివేదిక పార్లమెంట్…
DMK MP: డీఎంకే ఎంపీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ.. డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ మంగళవారం లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుంది. బీజేపీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రధానంగా హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో లేదా మేము గోమూత్ర రాష్ట్రాలుగా పిలుస్తాము వీటిలో బీజేపీ గెలుస్తుందని, మీరు దక్షిణ భారతదేశానికి రాలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళ,…
అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది కేంద్రం.. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది.. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది.