Parliament: పార్లమెంట్ దాడి సూత్రధారి.. డేట్ ఫిక్స్, ప్లాన్ చేసి.. ప్రస్తుతం పరారీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అత్యంత పకడ్భందీ సెక్యూరిటీ వ్యవస్థ ఉంటే పార్లమెంట్లోకి విజిటర్ పాసులపై వెళ్లిన ఇద్దరు నిందితులు హంగామా సృష్టించారు. పొగ డబ్బాలను పేల్చి హల్చల్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో నలుగురితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు లలిత్ ఝా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. లలిత్ని ప్రస్తుతం పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. పరారీలో ఉన్న అతను చివరిసారిగా ఢిల్లీకి 125 కిలోమీటర్ల దూరంలోని రాజస్థాన్, హర్యానా సరిహద్దుల్లోని నీమ్రానా అనే పట్టణంలో చివరిసారిగా లొకేషన్ ట్రేస్ అయింది.
2001, డిసెంబర్ 13 పార్లమెంట్ ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు గడుస్తున్న బుధవారం రోజునే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే ఈ మొత్తం కుట్రలో లలిత్ ఘా మాస్టర్ మైండ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి డేట్ ఫిక్స్ చేసింది, ప్లాన్ చేసింది ఇతనే అని తెలుస్తోంది. కోల్కతా నివాసి, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన లలిత్, షహీద్ భగత్సింగ్ చేత ప్రభావితమయ్యాడు. దేశం దృష్టి తనవైపు ఆకర్షించేలా చేయాలని అనుకున్నాడు. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం.. ఏ ఉగ్రవాద సంస్థతో ఇతని ఎలాంటి సంబంధాలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Read Also: Food Poisoning: పెళ్లి భోజనాల్లో ఫుడ్ పాయిజనింగ్.. 80 మందికి అస్వస్థత..
లలిత్ ఝా సహచరులు సాగర్ శర్మ, మనో రంజన్ పార్లమెంట్ లోపల, నీలందేవీ, అమోల్ షిండే పార్లమెంట్ వెలుపల భద్రత ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఐదో నిందితుడు విక్కీ శర్మను నిన్న సాయంత్ర గురుగ్రామ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితులు పొగడబ్బాలతో పార్లమెంట్లోకి వెళ్లాలని అనుకున్నారు. అయితే మనోరంజన్, సాగర్ శర్మలకు మాత్రమే విజిటర్ పాసులు లభించాయి. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం వీరికి పాసులను ఇష్యూ చేసింది.
లలిత్ పార్లమెంట్ వెలుపల పొగ వెలువడిన ఘటనను తన మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి, ఘటన స్థలం నుంచి పారిపోయే ముందు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మీడియా కవరేజీ కోసం అతను కోల్కతాలోని ఎన్జీఓ వ్యక్తితో ఈ విజువల్స్ని పంచుకున్నాడని తెలుస్తోంది. లలిత్ పారిపోయే ముందు నలుగురు వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు కూడా తీసుకెళ్లాడు. ఆధారాలు ఉండకుండా చేశాడని పోలీసులు భావిస్తున్నారు. విప్లవ భావజాలం కలిగిన వీరంతా ఓ ఫేస్ బుక్ ఫ్యాన్ పేజీలో చేరారు. గతేడాది లలిత్, సాగర్ శర్మ, మనో రంజన్ మైసూరులో కలుసుకున్నారు. అక్కడే వారు పార్లమెంట్లోకి చొరబడాలనే ప్లాన్ చేశారు. దీని తర్వాత నీలం, అమోల్ని ఈ పథకంలో చేర్చుకున్నారు. దీనిపై నిందితులంతా పలుమార్లు సమావేశమయ్యారు. లలిత్ వీరందరికి నాయకత్వం వహించాడు. వర్షాకాల సమావేశాల సమయంలో పార్లమెంట్ అన్ని ప్రవేశ మార్గాల వద్ద రెక్కీ నిర్వహించి, షూలను చెక్ చేయడం లేదని తెలుసుకుని ప్లాన్ చేసినట్లు మనోరంజన్ వెల్లడించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?