Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అది కూడా 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, సభ జరిగే సమయంలో ఛాంబర్ లోకి దూసుకెళ్లి పొగ క్యానిస్టర్లను పేల్చారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇలాంటి చర్యకే పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని సూత్రధారి లలిత్ ఝా గురువారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలందేవీ, మహేష్ కుమావత్లను 7 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు. ఢిల్లీ స్పెషల్ సెల్ ఈ కేసును విచారిస్తోంది.
Read Also: Bagheera: ప్రశాంత్ నీల్ రాసాడంటే… ఆ మాత్రం భోగ్గు ఉండాలి
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
నలుగురు పార్లమెంట్ వద్ద హంగామా చేయగా.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా వారి మొబైల్ ఫోన్లు, దుస్తులను తీసుకుని రాజస్థాన్ పారిపోయాడు. అక్కడ ఇతనికి మహేష్ కుమావత్ బస ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఆధారాలను నాశనం చేసేందుకు నిందితుల మొబైల్ ఫోన్లు, దస్తులకు ఝా నిప్పటించాడు. ప్రస్తుతం వీటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేందుకు నిందితులు ఈ డ్రామాకు పాల్పడ్డారు. పార్లమెంట్లో ఆత్మాహుతి చేసుకోవాలనే ఆలోచన కూడా నిందితులకు ఉన్నట్లు విచారణలో తేలింది.
ఈ ఘటన అధికార బీజేపీ, ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధాన్ని పెంచుతోంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా జారీ చేసిన పాసుల్ని తీసుకుని ఇద్దరు నిందితులు పార్లమెంట్ లోకి చొరబడ్డారు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎంపీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై లోక్సభ స్పీకర్ అత్యున్నత దర్యాప్తును కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, మోడీ విధానాలు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు కారణమని ఆరోపించారు. అయితే కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చొద్దంటూ ప్రతిపక్షాలపై విమర్శలకు దిగింది.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!