Parliament security breach: పార్లమెంట్ చొరబాటుదారుల ఉద్దేశం ఏమిటి..? పోలీసులకు ఏం చెప్పారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament security breach: పార్లమెంట్లోకి దుండగులు చొరబడటం, స్మోక్ డబ్బాలను వాడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నిందితులు పలు నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఛాంబర్ లోకి దూసుకెళ్లడం కలకలం సృష్టించింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా దేశం నివ్వెరపోయింది. డిసెంబర్ 13, 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి రోజే, ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. పార్లమెంట్ లోపల ఇద్దరు నిందితులు పొగ డబ్బాలతో హల్చల్ చేయగా.. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల హంగామా చేశారు. ఈ కుట్రలో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు, మరొకరు పరారీలో ఉన్నాడు.
నిందితులు నాలుగేళ్ల నుంచి టచ్లో ఉన్నట్లు, ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియా ద్వారా సమన్వయం చేసుకుని కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ భద్రతా ఉల్లంఘనకు పాల్పడే ముందు పార్లమెంట్పై రెక్కీ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
Read Also: Krishna Janmabhoomi: మథుర శ్రీకృష్ణ జన్మభూమి సర్వేకు కోర్టు అనుమతి..
వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఈ ఉల్లంఘన జరిగిందని నిందితులు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, మణిపూర్ హింసపై తాము కలత చెందామని నలుగురు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ విషయాలపై చట్టసభ సభ్యలు చర్చించడానికి వారి దృష్టిని ఆకర్షించేందుకు రంగు పొగను ఉపయోగించామని వారు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవాలని, సమస్యలతో ఆయనతో మాట్లాడాలని అనుకున్నట్లు తెలిపారు.
అయితే, నిందితులు చెప్పిన విషయాలను పోలీసులు నమ్మడం లేదు. వారి ఉద్దేశాన్ని నిర్ధారించేందుకు వారి ఫోన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫోన్లన్నీ నిందితుల్లో ఒకరైన లలిత్ ఝా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు మొబైల్ ఫోన్లతో లలిత్ పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు విజిటర్లుగా పార్లమెంట్ లోకి వెళ్లి, గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి దూసుకెళ్లి పొగ బాంబులను పేల్చారు. మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం దేవి అనే వ్యక్తులు పార్లమెంట్ బయట నిరసన తెలిపారు. వీరంతా కూడా గురుగ్రామ్ లోని లలిత్ ఝా నివాసంలో ఉన్నారు. ఈ ఘటనలో భద్రతా ఉల్లంఘనపై లోక్సభ సెక్రటేరియట్ 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!