Parliament security breach: పార్లమెంట్ చొరబాటుదారుల ఉద్దేశం ఏమిటి..? పోలీసులకు ఏం చెప్పారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament security breach: పార్లమెంట్లోకి దుండగులు చొరబడటం, స్మోక్ డబ్బాలను వాడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నిందితులు పలు నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఛాంబర్ లోకి దూసుకెళ్లడం కలకలం సృష్టించింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా దేశం నివ్వెరపోయింది. డిసెంబర్ 13, 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి రోజే, ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. పార్లమెంట్ లోపల ఇద్దరు నిందితులు పొగ డబ్బాలతో హల్చల్ చేయగా.. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల హంగామా చేశారు. ఈ కుట్రలో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు, మరొకరు పరారీలో ఉన్నాడు.
నిందితులు నాలుగేళ్ల నుంచి టచ్లో ఉన్నట్లు, ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియా ద్వారా సమన్వయం చేసుకుని కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ భద్రతా ఉల్లంఘనకు పాల్పడే ముందు పార్లమెంట్పై రెక్కీ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read
Read Also: Krishna Janmabhoomi: మథుర శ్రీకృష్ణ జన్మభూమి సర్వేకు కోర్టు అనుమతి..
వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఈ ఉల్లంఘన జరిగిందని నిందితులు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, మణిపూర్ హింసపై తాము కలత చెందామని నలుగురు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ విషయాలపై చట్టసభ సభ్యలు చర్చించడానికి వారి దృష్టిని ఆకర్షించేందుకు రంగు పొగను ఉపయోగించామని వారు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవాలని, సమస్యలతో ఆయనతో మాట్లాడాలని అనుకున్నట్లు తెలిపారు.
అయితే, నిందితులు చెప్పిన విషయాలను పోలీసులు నమ్మడం లేదు. వారి ఉద్దేశాన్ని నిర్ధారించేందుకు వారి ఫోన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫోన్లన్నీ నిందితుల్లో ఒకరైన లలిత్ ఝా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు మొబైల్ ఫోన్లతో లలిత్ పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు విజిటర్లుగా పార్లమెంట్ లోకి వెళ్లి, గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి దూసుకెళ్లి పొగ బాంబులను పేల్చారు. మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం దేవి అనే వ్యక్తులు పార్లమెంట్ బయట నిరసన తెలిపారు. వీరంతా కూడా గురుగ్రామ్ లోని లలిత్ ఝా నివాసంలో ఉన్నారు. ఈ ఘటనలో భద్రతా ఉల్లంఘనపై లోక్సభ సెక్రటేరియట్ 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!