Parliament Security Breach: “ప్రధాని మోడీ ‘మిస్సింగ్ పర్సన్’ అంటూ కరపత్రాలు”.. పార్లమెంట్ చొరబాటుదారులకు వారం కస్టడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Security Breach: బుధవారం రోజున జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2001లో పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 రోజునే, నలుగురు నిందితులు పార్లమెంట్ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు నిందితులు విజిటర్ పాసులతో పార్లమెంట్లోకి వెళ్లారు. సభ జరుగుతున్న సమయంలో విజిటర్ గ్యాలరీ నుంచి దూసి ఛాంబర్ వైపు దూసుకెళ్తూ, పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారు. నలుగురు నిందితులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝా అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Read Also: MK Stalin: హిందీ జాతీయ భాష కాదు.. తమిళ మహిళపై వేధింపుల తర్వాత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
ఇదిలా ఉంటే భారీ భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను విచారించడానికి 7 రోజుల పోలీస్ కస్టడీకి పంపబడ్డారు. లోక్ సభ లోపల పట్టుబడిన సాగర్ శర్మ, డి మనోరంజన్తో పాటు వెలుపల అరెస్టైన నీలం దేవీ, అమోల్ షిండేలను ప్రశ్నించాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో తన వాదనలు వినిపించారు. మరో కీలక నిందితుడు లలిత్ ఝా కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇతను నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లతో పరారయ్యాడు. సాక్ష్యాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నలుగురిపై ఉగ్రవాద వ్యతిరేక UAPA, ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. నలుగురు జరిపిన దాడి ఉగ్రదాడిగా ఉందని, ఈ సంఘటనలో ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఏదైనా ఉందా..? అని దర్యాప్తు చేయాలని పోలీసులు కోర్టులో వాదించారు. నిందితులు తమ బూట్లలో పొగ కానిస్టర్లను తీసుకువచ్చారని, నిందితులు లక్నోలో కొత్త షూ జతలను కొనుగోలు చేసి తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు. డబ్బాలను ముంబైలో కొనుగోలు చేశారని వెల్లడించారు. దీంతో పాటు ప్రధాని నరేంద్రమోడీని ‘మిస్సింగ్ పర్సన్’గా చెబుతూ కరపత్రాలు, అతని వివరాలను చెబితే స్విస్ బ్యాంక్ నుంచి నగదు ఇస్తామంటూ అందులో పేర్కనడం వంటివి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఢిల్లీ పోలీసులు. అయితే ఓ సామాన్యుడు ఇలాంటి ప్రణాళికతో పనిచేయలేడు కాబట్టి ఇందులో ఎక్కువ మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రత్యేక న్యాయమూర్తి హర్దీప్ కౌర్ ముందు పోలీసులు 15 రోజుల కస్టడీ కోరగా.. వారం రోజులు గడువు ఇచ్చారు.
తాజావార్తలు
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!