Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు 15 సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సమావేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘క్యాష్ ఫర్ క్వేరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్సభ సెషన్లో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్ సిఫారసు చేసిన మహువా మోయిత్రా బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి…
Parliament's Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, క్రిస్మస్కి ఒక రోజు ముందు ఈ సమావేశాలు ముగియవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు తర్వాత కొన్ని రోజులకు పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి ఆమె ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత జానారెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 75 వేల కోట్ల అప్పు చేస్తే.. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ 5లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా.. దేశంలో తొమ్మిదేళ్లలో 112 లక్షల కోట్లు మోడీ ఖర్చు చేశాడని తెలిపారు. మోడీ, కేసీఆర్ లు చేసిన అవినీతిపై ఒకరిపై ఒకరు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేసినా స్వీకరించలేదని జానారెడ్డి…
డీలిమిటేషన్ ( పునర్విభజన)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం వినాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కోరారు. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నారని ఆయన తెలిపారు.
Danish Ali: పార్లమెంట్ లో గురువారం చంద్రయాన్-3 చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రమేష్ బిధూరిని అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా కూడా సీరియన్ అయ్యారు. మరోసారి ఇవి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రమేష్ బిధూరికి బీజేపీ పార్టీ…
Ramesh Bidhuri: బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తన తోటి సభ్యుడు, బీఎస్పీ పార్టీకి చెందిన ముస్లిం ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. లోక్సభలో గురువారం చంద్రయాన్-3 మిషన్ పై చర్చ సందర్భంగా బిధూరి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బిధూరి వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునారవృతమైతే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ "నారీ శక్తి వందన్ అధినియం 2023" పేరిట మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడివేడి చర్చ సందర్భంగా బుధవారం మహిళా ఎంపీల పేలుడు ప్రసంగాలతో కొత్త పార్లమెంట్ ప్రతిధ్వనించింది. మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే మహిళలను గౌరవించడంలో విఫలమయ్యారని ప్రభుత్వంపై విరుచుకుపడగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ప్రభుత్వం మహిళలను లెక్కించిందని, గౌరవించిందని ప్రకటించారు.
India vs Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యవెనక భారత్ ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ ఖండించింది.