తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు (సోమవారం డిసెంబర్ 22న) అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ (మం) చింతల్ ఠాణ గ్రామ సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మృతి చెందిన వ్యక్తి సర్పంచ్ గా విజయం సాధించడంతో గ్రామస్తులు అయోమయంలో పడిపోయారు. పంచాయితీ ఎన్నికల్లో గ్రామ సర్పంచుగా చనిపోయిన వ్యక్తి చెర్ల మురళి గెలుపొందారు. Also Read:Tirumala Darshan Tickets:…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17న జరిగిన మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావటంతో.. వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు (సోమవారం డిసెంబర్ 22న) అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సర్పంచ్…
Storyboard: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కాకపోతే గతంలో ఎన్నడూ లేనంత హడావుడి కనిపించింది. గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. దీంతో ఓటర్లలోనూ ఎక్కడలేని ఆసక్తి కనిపించింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సహజంగా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి పంచాయతీల్లో కూడా చర్చ జరుగుతుంది. కానీ ఈసారి పల్లె పోరు గురించి తెలంగాణతో పాటు ఏపీలో కూడా చర్చ జరగటం కొత్త పరిణామంగా చూస్తున్నారు. ఇంతగా పంచాయతీ ఎన్నికల్ని ఫాలో అయిన జనం.. ఇప్పుడు ఎన్నికలు…
Off The Record: కాంగ్రెస్ పార్టీ అంటేనే విచ్చలవిడి అంతర్గత ప్రజాస్వామ్యం. ఒక్క గాంధీల కుటుంబాన్ని తప్ప… మిగతా వాళ్ళలో ఎవరు ఎవర్ని అయినా, ఏమైనా అనవచ్చంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ స్వేచ్ఛ ముసుగులో ఇప్పుడు కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ప్రకటించి కలకలం రేపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి తీరని నష్టం జరిగిపోతోందని, గాంధీభవన్లో తీసుకున్న నిర్ణయాలు క్షణాల్లో బీఆర్ఎస్ ఆఫీస్కు చేరిపోతున్నాయన్నది ఆయన వాదన. ఆ పార్టీ…
Panchayat Elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు నియోగించుకోనున్నారు. అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతరులు ఉన్నారు.…
Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. ఆమెతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల కవితను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.
High Court: తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు విచారించనుంది. బీసీ జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు కేటాయించలేదన్న ఆరోపణలతో పలువురు అభ్యర్థులు కోర్టు ఆశ్రయించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల తిమ్మనోనిపల్లి గ్రామ రిజర్వేషన్లపై ఒక పిటిషన్ దాఖలైంది. గ్రామంలోని అన్ని వార్డులను ఎస్సీ, ఎస్టీ వర్గాలకే కేటాయించారని, కానీ అక్కడ బీసీ జనాభా ఎక్కువగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని వాదిస్తున్నారు.
OTR : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మొదట గ్రామపంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, zptc, మున్సిపల్ ఎలక్షన్స్ జరపాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే… ఈ ఎన్నికలు మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాషాయదళానికి మాత్రం అగ్ని పరీక్షేనన్న వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు అది వర్తిస్తుందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి… ఆ ఫీల్గుడ్తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది పార్టీ…
Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేడు బీసీ రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం జరుగనున్నది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సమీక్ష కి డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి పొన్నం… తదితరులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపద్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. Also Read:Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు..…