Operation Sindoor Effect: భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” కారణంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దిగజారింది. ఈ దాడుల వల్ల పాకిస్తాన్ లో స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. దీనితో ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ తన అధికారిక X ఖాతా ద్వారా అంతర్జాతీయ భాగస్వాములకు అప్పుల కోసం విజ్ఞప్తి చేసింది. ఈ ట్వీట్లో.. ప్రతికూల శత్రు దాడుల వల్ల భారీ నష్టాలు ఎదుర్కొన్నాం. యుద్ధ…
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. భారత్తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఇప్పటికే ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చికెన్ ధర దాదాపు రూ. 800లకు చేరుకుంది. పాక్ ప్రజలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం మర్చిపోయి భారత్పై కారాలు మిరియాలు…
దక్షిణ కశ్మీర్లోని పహల్గామ్లోని బైసారన్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత.. పాకిస్థాన్ కూడా నిరంతరం బెదిరింపులు జారీ చేస్తోంది. బయటకు హెచ్చరికలు చేసినా.. నిజానికి పాకిస్థాన్ లోలోపల వణుకుతోంది.…
Pakistan: పాకిస్తాన్తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరాచీలో శుక్రవారం డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగాల్సింది, అయితే షాప్ ఒపెనింగ్ అంతలోనే గందరగోళంగా మారింది. తక్కువ ధరలకే వస్తువులు వస్తాయని షాప్ యాజమాన్యం ప్రకటనలతో అదరగొట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓపెనింగ్కి హాజరయ్యారు. పాకిస్తాన్ మొట్టమొదటి మెగా పొదుపు దుకాణంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
Pakistan: ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలకు తిందామంటే గోధుమ పిండి దొరకని పరిస్థితి ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రభుత్వం ఎలుకలను పట్టేందుకు లక్షల్లో డబ్బు ఖర్చు చేయడాన్ని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ పార్లమెంట్ హౌజులో ఎలుకల సంచారం పెరగడంతో వాటిని అరికట్టేందుకు, పిల్లులను రంగంలోకి దించారు. దీని కోసం పాక్ ప్రభుత్వం ఏకంగా రూ. 1.2 మిలియన్లనను కేటాయించింది.
Monsoon Brides: భారత ఉపఖండంలోని దేశాలకు రుతుపవనాలే జీవనాధారం. రుతుపవనాలపై ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అయితే, పాకిస్తాన్లో మాత్రం ‘‘రుతపవన పెళ్లికూతుళ్లు’’ పెరుగుతున్నారు. బాల్యంలోనే వారి తల్లిదండ్రులు వివాహాలు జరిపిస్తున్నారు. 2022లో పాకిస్తాన్ వ్యాప్తంగా, ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం ముందు భిక్షమెత్తుకుంటోంది. ఇక పాక ప్రజలు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్తున్న వారు అక్కడ భిక్షాటన చేస్తుండటం ఆ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి.
తన రక్షణ సామర్థ్యానికి కీలమైన అమెరికా తీయారీ F-16 విమానాల నిర్వహణకు బాధ్యత వహించే మిరాజ్ రీబిల్డ్ ఫ్యాక్టరీ(ఎంఆర్ఎఫ్), పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్ను రాబోయే సంక్షోభం గురించి హెచ్చరించింది.
Pakistan: పాకిస్తాన్కి ప్రధాని నరేంద్రమోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ వ్యాఖ్యానించారు. మోడీ మూడోసారి కూడా గెలుస్తారని జోస్యం చెప్పారు.