Pakistan: పాకిస్తాన్ ఎయిర్ లైనర్ PIAని కొనే దిక్కే లేదు..
- పాకిస్తాన్ ఎయిర్లైనర్ని కొనే దిక్కే లేదు.., PIA భవితవ్యంపై నీలినీడలు.., ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన దాయాది దేశం..
Pakistan: పాకిస్తాన్తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నుంచి 7 బిలియన్ల డాలర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా PIAని విక్రయించాలని అనుకుంటోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఐఎంఎఫ్, PIAని ప్రైవేటీకరించాలని పట్టుబడుతోంది.
దీంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ సర్కార్ దీనిని ఎవరైనా కొంటారా..? అని వెతకడం ప్రారంభించింది. పాక్ ప్రభుత్వం PIAలో 60 శాతం వాటా కోసం ప్రభుత్వ కనీస ధర 85 బిలియన్ పాకిస్తానీ రూపాయలు(సుమారుగా రూ. 250 కోట్లు)గా నిర్ణయించింది. అయితే, చివరగా ఒక బిడ్డర్ రియల్ ఎస్టేట్ సంస్థ బ్లూ వరల్డ్ సిటీ ప్రభుత్వం అడిగిన ధరలో 8 శాతం అంటే కేవలం రూ. 30 కోట్లు బిడ్డింగ్ చేసింది.
Also Read
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
- Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
Read Also: Seethakka: స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్న్యూస్..
ఇటీవల బిడ్డింగ్ ప్రక్రియను పారదర్శకత తీసుకురావడానికి పాక్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇస్లామాబాద్లోని ఓ హోటల్లో ఈ వేలం జరిగింది. పీటీవీ దీనిని లైవ్ టెలికాస్ట్ చేసింది. ఆఫర్ చాలా తక్కువగా ఉందని ప్రభుత్వం భావించడంతో చివరికి బిడ్ తిరస్కరించబడింది. సేల్ విఫలమైన తర్వాత, తన బిడ్ తిరస్కరణకు గురైతే పాక్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తానని బ్లూ వరల్డ్ సిటీ చైర్మన్ సాద్ నజీర్ వ్యాఖ్యానించాడు.
ఎయిర్లైన్ యొక్క మొత్తం ఆస్తుల విలువ సుమారు 152 బిలియన్ పాకిస్తానీ రూపాయలు (దాదాపు రూ. 450 కోట్లు). అయితే దీనికి 1 బిలియన్ రూపాలయ అప్పులు కూడా ఉన్నాయి. విదేశీ కొనుగోలుదారులు దీనిని కొనేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్, PIAని స్వాధీనం చేసుకుని, దానిని ‘ఎయిర్ పంజాబ్’గా రీబ్రాండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉంది, అయితే దీనికి పాకిస్తాన్ పార్లమెంటు నుండి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
తాజావార్తలు
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
-
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
-
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!