Pakistan: పాకిస్తాన్ ఎయిర్ లైనర్ PIAని కొనే దిక్కే లేదు..
- పాకిస్తాన్ ఎయిర్లైనర్ని కొనే దిక్కే లేదు.., PIA భవితవ్యంపై నీలినీడలు.., ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన దాయాది దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నుంచి 7 బిలియన్ల డాలర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా PIAని విక్రయించాలని అనుకుంటోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఐఎంఎఫ్, PIAని ప్రైవేటీకరించాలని పట్టుబడుతోంది.
దీంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ సర్కార్ దీనిని ఎవరైనా కొంటారా..? అని వెతకడం ప్రారంభించింది. పాక్ ప్రభుత్వం PIAలో 60 శాతం వాటా కోసం ప్రభుత్వ కనీస ధర 85 బిలియన్ పాకిస్తానీ రూపాయలు(సుమారుగా రూ. 250 కోట్లు)గా నిర్ణయించింది. అయితే, చివరగా ఒక బిడ్డర్ రియల్ ఎస్టేట్ సంస్థ బ్లూ వరల్డ్ సిటీ ప్రభుత్వం అడిగిన ధరలో 8 శాతం అంటే కేవలం రూ. 30 కోట్లు బిడ్డింగ్ చేసింది.
Also Read
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
Read Also: Seethakka: స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్న్యూస్..
ఇటీవల బిడ్డింగ్ ప్రక్రియను పారదర్శకత తీసుకురావడానికి పాక్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇస్లామాబాద్లోని ఓ హోటల్లో ఈ వేలం జరిగింది. పీటీవీ దీనిని లైవ్ టెలికాస్ట్ చేసింది. ఆఫర్ చాలా తక్కువగా ఉందని ప్రభుత్వం భావించడంతో చివరికి బిడ్ తిరస్కరించబడింది. సేల్ విఫలమైన తర్వాత, తన బిడ్ తిరస్కరణకు గురైతే పాక్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తానని బ్లూ వరల్డ్ సిటీ చైర్మన్ సాద్ నజీర్ వ్యాఖ్యానించాడు.
ఎయిర్లైన్ యొక్క మొత్తం ఆస్తుల విలువ సుమారు 152 బిలియన్ పాకిస్తానీ రూపాయలు (దాదాపు రూ. 450 కోట్లు). అయితే దీనికి 1 బిలియన్ రూపాలయ అప్పులు కూడా ఉన్నాయి. విదేశీ కొనుగోలుదారులు దీనిని కొనేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్, PIAని స్వాధీనం చేసుకుని, దానిని ‘ఎయిర్ పంజాబ్’గా రీబ్రాండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉంది, అయితే దీనికి పాకిస్తాన్ పార్లమెంటు నుండి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..