Pakistan: పాకిస్తాన్ ఎయిర్ లైనర్ PIAని కొనే దిక్కే లేదు..
- పాకిస్తాన్ ఎయిర్లైనర్ని కొనే దిక్కే లేదు.., PIA భవితవ్యంపై నీలినీడలు.., ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన దాయాది దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నుంచి 7 బిలియన్ల డాలర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా PIAని విక్రయించాలని అనుకుంటోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఐఎంఎఫ్, PIAని ప్రైవేటీకరించాలని పట్టుబడుతోంది.
దీంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ సర్కార్ దీనిని ఎవరైనా కొంటారా..? అని వెతకడం ప్రారంభించింది. పాక్ ప్రభుత్వం PIAలో 60 శాతం వాటా కోసం ప్రభుత్వ కనీస ధర 85 బిలియన్ పాకిస్తానీ రూపాయలు(సుమారుగా రూ. 250 కోట్లు)గా నిర్ణయించింది. అయితే, చివరగా ఒక బిడ్డర్ రియల్ ఎస్టేట్ సంస్థ బ్లూ వరల్డ్ సిటీ ప్రభుత్వం అడిగిన ధరలో 8 శాతం అంటే కేవలం రూ. 30 కోట్లు బిడ్డింగ్ చేసింది.
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
Read Also: Seethakka: స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్న్యూస్..
ఇటీవల బిడ్డింగ్ ప్రక్రియను పారదర్శకత తీసుకురావడానికి పాక్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇస్లామాబాద్లోని ఓ హోటల్లో ఈ వేలం జరిగింది. పీటీవీ దీనిని లైవ్ టెలికాస్ట్ చేసింది. ఆఫర్ చాలా తక్కువగా ఉందని ప్రభుత్వం భావించడంతో చివరికి బిడ్ తిరస్కరించబడింది. సేల్ విఫలమైన తర్వాత, తన బిడ్ తిరస్కరణకు గురైతే పాక్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తానని బ్లూ వరల్డ్ సిటీ చైర్మన్ సాద్ నజీర్ వ్యాఖ్యానించాడు.
ఎయిర్లైన్ యొక్క మొత్తం ఆస్తుల విలువ సుమారు 152 బిలియన్ పాకిస్తానీ రూపాయలు (దాదాపు రూ. 450 కోట్లు). అయితే దీనికి 1 బిలియన్ రూపాలయ అప్పులు కూడా ఉన్నాయి. విదేశీ కొనుగోలుదారులు దీనిని కొనేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్, PIAని స్వాధీనం చేసుకుని, దానిని ‘ఎయిర్ పంజాబ్’గా రీబ్రాండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉంది, అయితే దీనికి పాకిస్తాన్ పార్లమెంటు నుండి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!