Putin: “పుతిన్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లరు”.. పాక్ జర్నలిస్ట్ చెప్పిన నిజం ఏంటంటే..
- పుతిన్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లరు..?
- పాకిస్తానీయుల్లో మొదలైన ప్రశ్న..
- పాక్ జర్నలిస్టు చెప్పిన నిజం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు భారత్ అపూర్వ స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్రమోడీ నేరుగా వెళ్లి ఎయిర్పోర్టులో పుతిన్ను రిసీవ్ చేసుకున్నారు. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. భారత్-రష్యా మధ్య బంధం మరింత బలపడుతుందని ఇరువురు నేతలు కొనియాడారు. పుతిన్ పర్యటనపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పుతిన్-మోడీ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయని వెస్ట్రన్ దేశాలు, వెస్ట్రన్ మీడియా నిశితంగా గమనిస్తోంది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా పుతిన్ ఇండియా పర్యటనపై ఆసక్తి కనబరుస్తోంది. అక్కడి మీడియా ప్రధానంగా పుతిన్ పర్యటన గురించి మాట్లాడుతోంది. అయితే, భారత్ వెళ్లిన పుతిన్, పాకిస్తాన్కు ఎందుకు రారు? అనే ప్రశ్న సాధారణ పాకిస్తానీల్లో తలెత్తుతోంది. పుతిన్ చాలా సార్లు భారత్ వచ్చినప్పటికీ, పాకిస్తాన్కు రాకపోవడం వల్ల దాయాది దేశం తీవ్ర నిరాశ చెందుతోంది. పుతిన్ మాత్రమే కాదు, ఏ రష్యన్ అధ్యక్షుడు కూడా పాకిస్తాన్ సందర్శించలేదు.
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఆగ్రహం.. ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాలి
పాక్ జర్నలిస్ట్ చెబుతున్న చేదు నిజం..
పాకిస్తాన్ జర్నలిస్ట్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అర్జూ కజ్మీ పుతిన్ పాకిస్తాన్ ఎందుకు రాడో వివరించాడు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని పలుమార్లు తాము భిక్షాటన గిన్నెతో మిత్రదేశాలకు వెళ్తున్నామని చెప్పారని, పుతిన్ ఇక్కడి వచ్చి తన జేబును ఎందుకు ఖాళీ చేయించుకోవాలని అనుకుంటారు.? అని అన్నారు. పాకిస్తాన్ రక్షణ విశ్లేషకుడు ఖమర్ చీమా ఇంటర్వ్యూలో అర్జూ కజ్మీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ పాకిస్తాన్ ఎందుకు రారు..? భారత్ తో సరదాగా మాట్లాడుతున్నారు అని చీమా, ఖజ్మీని ప్రశ్నించారు. ‘‘ మనకు ఆయనతో ఏ వ్యాపారం ఉంది.? మనం ఆయనను ఆహ్వానిస్తే, ఏం చెబుతాము? ఫైటర్ జెట్లు, ఆయిల్ అప్పుపై ఇవ్వాలని కోరుతామా? భారత్కు ఇచ్చినట్లు మాకు ఇవ్వాలని అడుగుతామా? భారత్ డబ్బు చెల్లిస్తుంది. కానీ మనం ఎప్పుడూ వడ్డీలు లేకుండా, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇస్తాం. ఇదే భారత్కు పాకిస్తాన్కు తేడా’’ అని ఆయన అన్నారు.
పుతిన్ మన కోసం ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా లేరని, అందుకే భారత్ వెళ్లారని, భారత్ నగదు చెల్లించి సరకులు తీసుకుంటోందని కజ్మీ చెప్పారు. పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుని, నగదు చెల్లించగలిగితే, ఇతర దేశాలు కూడా మన వద్దకు వస్తాయని అన్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..