Pakistan Declares National Emergency: అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.. మరోవైపు శ్రీలంక పరిస్థితి కళ్లముందు కనిపిస్తోంది దాయాది దేశానికి. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల మధ్య ఆ దేశాన్ని వరదలు, భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. వరదల వల్ల ఏకంగా 937 మందికి పైగా మరణించారు. 3 కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో భారీ వరదల కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘జాతీయ అత్యవసర పరిస్థితి’’ని ప్రకటించింది.
lions rates cheaper than buffaloes rates In Pakistan: పాకిస్తాన్ దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు విలాస వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే మానేశాయి. దీంతో పాటు పెట్రోల్ ధరలు పెరిగాయి. గ్యాస్, ఇంధన కొరతతో విద్యుత్ సమస్యలు తెలత్తుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక సమస్యలు జంతువులపై కూడా పడ్డాయి. ఇటీవల లాహోర్ సఫారీ జూలో ఆఫ్రికన్ సింహాలను అమ్మేందుకు జూ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఒక్కో సింహానికి…
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంక తరువాత ఏ దేశం అంటే వినిపించే పేరు పాకిస్తాన్. అయితే అక్కడ కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం హెచ్చరించారు. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చే రోజు దగ్గర్లో ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ జార్దారీ, షరీఫ్ కుటుంబాలు మూడు నెల్లలోనే తాము అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు…