Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఇది.. షాప్ ఓపెన్ తర్వాత 30 నిమిషాల్లోనే లూటీ.. వీడియో వైరల్..
- పాకిస్తాన్లో అరగంటలోనే దుకాణం లూటీ..
- షాప్ ప్రారంభించిన అరగంటనే ఖాళీ చేసిన ప్రజలు..
- కరాచీలో ఘటన.. వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ద్రవ్యోల్భణం పెరగడంతో ప్రజలకు నిత్యావసరాలు అందుబాటు ధరలకు దొరకడం లేదు. అయితే, తాజాగా కరాచీలో ఓ షాప్ ప్రారంభించిన 30 నిమిషాల్లోనే ప్రజలు లూటీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతోంది. దీనిని బట్టి చూస్తే ఆ దేశం, అక్కడి ప్రజలు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
Read Also: Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
కరాచీలో శుక్రవారం డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగాల్సింది, అయితే షాప్ ఒపెనింగ్ అంతలోనే గందరగోళంగా మారింది. తక్కువ ధరలకే వస్తువులు వస్తాయని షాప్ యాజమాన్యం ప్రకటనలతో అదరగొట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓపెనింగ్కి హాజరయ్యారు. పాకిస్తాన్ మొట్టమొదటి మెగా పొదుపు దుకాణంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ఈవెంట్ దుస్తులు, ఉపకరణాలు మరియు గృహోపకరణాలపై తక్కువ ధరలకే ఇస్తామని వాగ్దానం చేసింది. మాల్ వెలుపల వేలాది మంది ప్రజలు గుమిగూడడంతో, వారిని నియంత్రించడానికి నిర్వాహకులు కష్టపడ్డారు.
పరిస్థితిని గమనించి షాప్ని మూసేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంతో, షాపు అద్దాలు పగలగొట్టి గుంపు షాపులోకి ప్రవేశించింది. ఆ తర్వాత షాపులోని బట్టలును, వస్తువుల్ని లూటీ చేశారు. షాపు మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభమైతే కేవలం అరగంటలోనే 3.30 గంటలకు మొత్తం ఖాళీ అయింది. అరగంటలోనే ప్రజలు షాపుని కొల్లగొట్టారు. ‘‘మేము కరాచీ ప్రజల ప్రయోజనం కోసం దీనిని తీసుకువచ్చామని, ఇప్పుడు పరిస్థితి ఇదని దాని ఉద్యోగి కన్నీటిపర్యంతమయ్యాడు. విదేశాల్లో ఉంటున్న ప్రవాస పాకిస్తానీ వ్యక్తి కరాచీలో ఈ మాల్ని ప్రారంభించారు. ఈ ఘటనపై పాక్ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడేందుకు ఇంత సంఖ్యలో ముందుకు వస్తే దేశం పరిస్థితి బాగుండేదని, కానీ దీనికి బదులుగా రూ. 50కి వచ్చే షర్టులకు ప్రాధాన్యత ఇచ్చారని ఎక్స్లో రాశారు.
https://twitter.com/Politicspedia23/status/1830115111102513395
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..