Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు
- తాజాగా మరోసారి పెరిగిన పంచదార ధరలు
- కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చక్కెర ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజురోజుకు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత వరుసగా పండుగలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో పంచదార ధరలు కొండెక్కడంతో సామాన్యులు లబిదిబో అంటున్నారు.
త్వరలోనే కీలక పండుగలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో చక్కెర ధరలు 9 శాతం పెరిగాయి. గత నెలలో దేశంలో చక్కెర సగటు రిటైల్ ధర సుమారుగా 6.6 శాతం పెరిగాయి. నెల రోజుల క్రితం దేశంలో చక్కెర సగటు రిటైల్ ధర కిలోకు రూ.47.17 ఉండగా.. ఇప్పుడు అది కిలోకు రూ.50.30కి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే కూడా చక్కెర ధరలు సుమారుగా 9 శాతం పెరిగాయి. పండుగ సీజన్కు ముందు చక్కెర ధరలు పెరగడం సామాన్యుల గృహ బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. అయితే పెరుగుతున్న ధరలను అరికట్టడానికి ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. నిల్వలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం డీలర్ల దగ్గర పరిమితి కూడా విధించింది. చక్కెర డీలర్లకు నిల్వల పరిమితి ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు పరిమితి అమలులో ఉంటుందని తెలిపింది. దేశీయ వినియోగానికి దేశంలో తగినంత చక్కెర ఉందని, వినియోగదారులకు సరసమైన ధరలకు చక్కెర లభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
ధరలు ఎందుకు పెరిగాయి?
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై స్పందించింది. ప్రభుత్వం ప్రకారం.. ఇటీవలి ఎక్స్-మిల్ చక్కెర ధరల పెరుగుదల ప్రస్తుత డిమాండ్, సరఫరా పరిస్థితికి అనుగుణంగా లేదు. కొంతమంది వ్యాపారులు, డీలర్లు, మార్కెట్ మధ్యవర్తులు చక్కెరను నిల్వ చేస్తున్నారని కూడా ప్రభుత్వానికి తెలిసింది. అంతేకాకుండా చక్కెర సరఫరా లేకుండా జరిగే ఊహాజనిత లావాదేవీలు, కాగితపు వ్యాపారాలు మార్కెట్లో కొరతకు పూనుకుంటున్నారు. ఈ కారణాల వల్ల చక్కెర ధరలలో భారీ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని, మిల్లు నుంచి అమ్మే ధరలతో పాటు చిల్లర ధరలు కూడా పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది.
దేశీయ అవసరాలను తీర్చడానికి దేశంలో తగినంత చక్కెర అందుబాటులో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్కెట్లో కొరత సృష్టించి ధరలను పెంచే ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, దేశంలో తగినంత చక్కెర లభ్యతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొత్త నిబంధనల ప్రకారం.. చక్కెర వ్యాపారులందరూ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆన్లైన్ పోర్టల్ను ఉపయోగించి ప్రతి వారం తమ చక్కెర నిల్వలను నివేదించడంతో పాటు, వాటిని నవీకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చక్కెర మార్కెట్ను నిరంతరం పర్యవేక్షిస్తూ, ధరలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. చక్కెర మార్కెట్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. నిల్వలను, ఊహాగానాలను నివారించడం, మార్కెట్లో చక్కెర సరఫరా స్థిరంగా ఉండేలా చూడటం, ధరలు పెరగకుండా నిరోధించడం కోసమే నిల్వలపై పరిమితులు విధించడం జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Tags
- india
- Sugar
- SUGAR PRICE HIKE
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!