తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఎపిసోడ్ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశం రచ్చరేపుతుంటే.. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. యాదగిరిగుట్టలో ఆలయం ప్రారంభానికి తనను పిలవలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. అయితే, ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో మా ఇష్టం అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దీనికి తోడు తరచుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు గవర్నర్ విందుకి ఆహ్వానిస్తే టీఆర్ఎస్ మంత్రులు ఎవరూ వెళ్లకపోవడంపై…
ధాన్యం కొనకుంటే అధికారం నుంచి కేసీఆర్ తప్పుకోవాలి. నీచ, నికృష్టమైన, మతి తప్పిన కేసీఆర్ ఆలోచనలతో రైతులు మునిగిపోయారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే.. శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? చేతకాక,చేవలేక ముఖ్యమంత్రి చిల్లర పనులు చేస్తున్నాడు. పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేస్తున్నాడు. లక్షలాది మంది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల. తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని…
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్కి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. నిత్యం రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా తెలంగాణ మంత్రి కె.తారకరామారావు హాట్ కామెంట్స్ చేశారు. ఏప్రిల్ పూల్స్ డే సందర్భంగా ఎన్టీయే ప్రభుత్వం అచ్చెదిన్ జరుపుకోవాలని వేసిన ఒక కార్టూన్ కి స్పందించారు. ఆ కార్టూన్ ని రిట్వీట్ చేశారు. తాను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వాస్తవాలు వివరిస్తూనే వుంటానని అది చూసి తట్టుకోలేనివారు దయచేసి తనను…
తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీబచేసిన ట్వీట్ పై టీఆర్ఎస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని భావించాం. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ గురించి, ఈ దేశం గురించి కేటీఆర్ కు అవగాహన లేదు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నా, నిజమో కాదో, తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెలుసుకోవాలి.…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కాదన్నారు కవిత. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ…
వరి యుద్ధం రసవత్తరంగా మారుతోంది. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రుల పర్యటన తర్వాత మరింత వేడెక్కాయి రాజకీయాలు. తెలంగాణ మంత్రులు ఢిల్లీ పోయి వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను బీజేపీ మంత్రి పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. మనల్ని నూకలు తిను అనడం..యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే అన్నారు మంత్రి హరీష్ రావు. ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ధరలు తగ్గుతాయి. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి…
కేసీఆర్ లొల్లి లేని దగ్గర లొల్లి చేస్తున్నాడు. బస్ ఛార్జ్ లు చెప్పకుండా పెంచారని మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరెంట్ ఛార్జ్ లు పెంచారు… ఛార్జ్ ల పెంపు ను డైవర్ట్ చేయడానికే ఢిల్లీకి మంత్రులను పంపించారన్నారు. ఓట్లు సీట్లు కొంటున్న కేసీఆర్ … ఇతర రాష్ట్రాల నేతలకు డబ్బులిచ్చి కొంటున్న సీఎం …ధాన్యం ఎందుకు కొనడం లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మంత్రులని ఢిల్లీకి కొట్లాటకు పంపించావా… సమస్య పరిష్కారం కోసం…
వరుసగా పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల బాదుడుతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారు. చంద్రబాబు హయాంలో ఛార్జీల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఇపుడు ధరలు తగ్గించక పోతే, ఆందోళనలు చేస్తాం అన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలన్నారు. కేసీఆర్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బదనాం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనయ్ అన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉందని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మానసిక క్షోభకు…
రైతు పడించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే సేకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ లోని లక్ష్మీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ దేశములో పండే ప్రతి వరి గింజను కొనాలని ఉంది. కానీ…