Congress Vs Trs: ధాన్యం కొనుగోళ్ళపై ట్వీట్ల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కాదన్నారు కవిత.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022
ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని సలహా ఇచ్చారు. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
కవిత గారూ…టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు… సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు.
ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?#FightForTelanganaFarmers https://t.co/WtYnUu9hjM
— Revanth Reddy (@revanth_anumula) March 29, 2022
ఇదిలా వుంటే తమ అధినేత రాహుల్ గాంధీపై కవిత చేసిన ట్వీట్ కి కౌంటరిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కవిత గారూ…టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు… సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!? అంటూ ట్వీట్ చేశారు రేవంత్.
మొత్తం మీద టీఆర్ఎస్ బీజేపీ గా వున్న వరియుద్ధంలో కొత్త ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఇప్పుడది కాంగ్రెస్ టీఆర్ఎస్ గా మారిందని చెప్పాలి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!