Jagadish Reddy: రైతుల జీవితాలతో దోబూచులాడొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు పడించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే సేకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ లోని లక్ష్మీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ దేశములో పండే ప్రతి వరి గింజను కొనాలని ఉంది. కానీ ఆ బాద్యత నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే బీజేపీ , కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి తెలంగాణ రైతాంగం తో దోబూచులాడుతున్నారు. ఒకవైపు బీజేపీ పార్టీ గా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్టం అంత తిరిగి వరి ధాన్యం పండించాలని చెప్పాడు. మరో వైపు కేంద్ర మంత్రులు దాన్యం కొనలేమని రకరకాల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండే ప్రతి ధాన్యం గింజ కొనాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారన్నారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమం చెసినట్లే, మరో ఉద్యమం చేసైనా తెలంగాణ రైతాంగం హక్కులు కాపాడతాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది పెట్టుబడి దారులకు అనుకూలమైన చట్టాలు చేస్తూ..కోట్లాది మంది రైతాంగానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ వైఖరి ని ఎండగడుతూ ఇంటింటికి తీసుకువెళ్లేందుకే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా తెలంగాణలో పండే ధాన్యం కొనేలా చేస్తాం. రైతులకు అండగా నిలబడతాం అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..