Harishrao: నూకలు తినమని అవమానించారు
వరి యుద్ధం రసవత్తరంగా మారుతోంది. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రుల పర్యటన తర్వాత మరింత వేడెక్కాయి రాజకీయాలు. తెలంగాణ మంత్రులు ఢిల్లీ పోయి వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను బీజేపీ మంత్రి పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. మనల్ని నూకలు తిను అనడం..యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే అన్నారు మంత్రి హరీష్ రావు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ధరలు తగ్గుతాయి. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి నూకలు చెల్లేలా తీర్పు ఇవ్వండి. పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి బీజీపీ నేతలు మాట్లాడాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది. మళ్ళీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో 15 లక్షల ఉద్యోగాలు పైగా ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే వెంటనే 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని హరీష్ రావు. బండి సంజయ్ దమ్ముంటే ముందు ఆ పని చేయించు కేంద్రంతో అని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.
Also Read
మరోవైపు వివిధ గ్రామపంచాయతీలు కేంద్రానికి తీర్మానాలు పంపుతున్నాయి. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోడీ కి తెలంగాణ గ్రామాల నుండి వెల్లువెత్తుతున్నాయి విజ్ఞప్తులు. కరీంనగర్ మండలం నుండి తాహర్ కొండాపూర్ , చేగుర్థి, బహుదూర్ ఖాన్ పేట, మొదలు 17 గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కొత్తపల్లి మండలంలో 8 గ్రామాల్లో తీర్మానం చేయగా, ప్రతి గ్రామం నుండి తీర్మాన కాపీని కేంద్రానికి పంపించారు గ్రామ పెద్దలు. రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం నుండి కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి తీర్మానం పంపారు. తెలంగాణలో పండిన రబీ వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!