Harishrao: నూకలు తినమని అవమానించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి యుద్ధం రసవత్తరంగా మారుతోంది. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రుల పర్యటన తర్వాత మరింత వేడెక్కాయి రాజకీయాలు. తెలంగాణ మంత్రులు ఢిల్లీ పోయి వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను బీజేపీ మంత్రి పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. మనల్ని నూకలు తిను అనడం..యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే అన్నారు మంత్రి హరీష్ రావు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ధరలు తగ్గుతాయి. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి నూకలు చెల్లేలా తీర్పు ఇవ్వండి. పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి బీజీపీ నేతలు మాట్లాడాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది. మళ్ళీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో 15 లక్షల ఉద్యోగాలు పైగా ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే వెంటనే 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని హరీష్ రావు. బండి సంజయ్ దమ్ముంటే ముందు ఆ పని చేయించు కేంద్రంతో అని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
మరోవైపు వివిధ గ్రామపంచాయతీలు కేంద్రానికి తీర్మానాలు పంపుతున్నాయి. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోడీ కి తెలంగాణ గ్రామాల నుండి వెల్లువెత్తుతున్నాయి విజ్ఞప్తులు. కరీంనగర్ మండలం నుండి తాహర్ కొండాపూర్ , చేగుర్థి, బహుదూర్ ఖాన్ పేట, మొదలు 17 గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కొత్తపల్లి మండలంలో 8 గ్రామాల్లో తీర్మానం చేయగా, ప్రతి గ్రామం నుండి తీర్మాన కాపీని కేంద్రానికి పంపించారు గ్రామ పెద్దలు. రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం నుండి కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి తీర్మానం పంపారు. తెలంగాణలో పండిన రబీ వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!