అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా ఓటిటీ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ థియేటర్లలో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే… థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన జనం ఓటీటీలో మరోసారి చూశారు. అంతేకాదు… ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు. ఫలితంగా శని, ఆదివారాల్లో పలు చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే……
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విశ్వరూపం దాలుస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలతో పాటు సినిమా రంగంపై కూడా పడింది. ఇప్పటికే పలు పాన్ ఇండియా సినిమాల విడుదల వాయిదా పడుతున్నాయి. టాలీవుడ్ లో దాని ప్రభావం ‘ఆర్.ఆర్.ఆర్.’ పై పడింది. వరల్డ్ వైడ్ గా జనవరి 7న విడుదల కావలసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టారర్ రిలీజ్ వాయిదా ఖాయమని తెలుస్తోంది. ఇది వేసవిలో రిలీజ్ అవుతుందని వినిపిస్తోంది. నిజానికి గత కొన్నాళ్ళుగా ‘ఆర్.ఆర్.ఆర్.’, ‘రాధేశ్యామ్’…
యంగ్ హీరో నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలయ్యాయి. చిత్రం ఏమంటే ఈ రెండు చిత్రాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగశౌర్య, రీతువర్మ జంటగా నిర్మించిన ‘వరుడు కావలెను’ మూవీతో లక్ష్మీ సౌజన్య తొలిసారి మెగాఫోన్ పట్టింది. ఇది అక్టోబర్ 29న విడుదల కాగా ఈ డిసెంబర్ 10న నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ మూవీ జనం ముందుకు వచ్చింది. బాధాకరం…
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. అక్టోబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. జనవరి 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది. Read Also: 2021 టాలీవుడ్ హిట్స్ – ఫట్స్…
అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’. నిజానికి రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ తెలుగు వారి ముందుకు ఈ మూవీతోనే రావాల్సింది. కానీ దీని విడుదల జాప్యం కావడంతో ‘అద్భుతం’ సినిమా ముందు రిలీజైంది. చిత్రం ఏమంటే ఆమె నటించిన తొలి రెండు సినిమాలూ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. ‘118’ మూవీతో తొలిసారి డైరెక్టర్ గా మారిన సినిమాటోగ్రాఫర్ కె. వి గుహన్ రూపొందించిన ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ లో…
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. ఇటీవల థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల వర్షం కురిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ది లూప్ పేరుతో విడుదల చేశారు. తెలుగులోనూ మంచి…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మూడో చిత్రంగా విడుదలైన అఖండ.. అఖండమైన విజయాన్ని అందుకొని.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లో మాస్ జాతర చూపిస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నదట .. ఇక దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొత్త సంవంత్సరం…
యంగ్ హీరో శర్వానంద్ కి ఘోర అవమానం జరిగిందా అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం శర్వా కెరియర్ ప్లాపులతో నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే విడుదలైన మహా సముద్రం డిజాస్టర్ గా నిలవడంతో ఈ హీరోకు ప్రస్తుతం ఒక గేమ్ చేంజర్ హిట్ అనేది తప్పకుండా అవసరం. దానికోసం శర్వా బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శర్వా ఆశలన్నీ తన తదుపరి చిత్రాలు ‘ఒకే ఒక జీవితం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పైనే…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్న ‘జై భీమ్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో సూర్య యాక్టింగ్, ఆ కథ వెరసి ఆ సినిమాను ఊహించలేనంత విజయాన్ని అందుకునేలా చేశాయి. అయితే దీనిపై ఒక పక్క వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడా సూర్య జంకడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక కథను సూర్య ఎంచుకోవడం.. దానిని ఆయనే స్వయంగా నిర్మించడం పెద్ద రిస్క్ తో కూడుకున్న పని.…