ఓటిటీ బాట పట్టనున్న అక్కినేని హీరో కొత్త సినిమా..?
అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా ఓటిటీ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటీ సంస్థ జీ గ్రూప్ భారీ మొత్తంలో ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. పెళ్ళైన జంట కొన్ని విభేదాల వలన విడాకులు తీసుకుంటారు. విడాకుల తరువాత ఆ వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులను వినోదాత్మకంగా చూపించినట్లు డైరెక్టర్ తెలిపారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాలి.
Also Read
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!