తెలంగాణలో కొందరు ఐఏఎస్ల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ట్రాన్స్ఫర్ అవుతారు కానీ.. పోస్టింగ్ ఉండదు. ఏడెనిమిది నెలలుగా ఇదే దుస్థితి. కలెక్టర్లుగా బిజీగా పనిచేసిన వారు రోజుల తరబడి వర్క్ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. అలాంటి ఆఫీసర్లపై అధికారవర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. కలెక్టర్లుగా పనిచేసిన వారికి ఏడెనిమిది నెలలుగా పోస్టింగ్ లేదు సాధారణంగా ఒక IASను ఒక పోస్ట్ నుండి బదిలీ చేస్తే మరోచోట పోస్టింగ్ ఇస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ఆ టైమ్లో కొత్తచోట అడ్జస్ట్…
పోడు భూముల సమస్య అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు తలపోటుగా మారింది. సీజన్ వస్తే చాలు.. అటవీ అధికారులతో లడాయి తప్పడం లేదు. ఆగ్రహావేశాలు.. దాడులు.. ఉద్రిక్తతలు రొటీన్ అయిపోయాయి. సమస్యను రాజకీయం చేయడానికి విపక్షాలు చూస్తుండటంతో మరింత టెన్షన్ పడుతున్నారట టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. శాంతిభద్రతల సమస్యగా పోడు భూముల రగడ అటవీ అధికారులు.. గిరిజనులకు మధ్య పోడు భూములపై రగడ పాతదే. కానీ.. ఎప్పటికప్పుడు కొత్తగా తెరపైకి వస్తుంది. అడవినే నమ్ముకున్న తాము పోడు వ్యవసాయం చేసుకుంటే తప్పేంటని…
ఐదు దశాబ్దాలుగా నలుగుతోన్న బ్యారేజ్ అంశంపై ఎట్టకేలకు ట్రైబ్యునల్ నుంచి సానుకూల తీర్పు వచ్చింది. ఆ తీర్పుతో ఖుషీ అయ్యారు అధికార పార్టీ నాయకులు. ఆ విజయం తమదే అని ప్రచారం చేసుకున్నారు కూడా. త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ఎక్కడి వారు అక్కడే గప్చుప్. ఇంతకీ నేతలకు మింగుడు పడని అంశాలేంటి? దశాబ్దాల కల.. కలేనా? 1961లోనే నేరడి బ్యారేజీ కోసం శంకుస్థాపన నేరడి బ్యారేజ్.…
ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే పార్టీలోనే ఉన్నా.. ఐక్యత లేదు. అంశం ఏదైనా వీరి మధ్యకు వస్తే రచ్చే. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘం పదవులకు ప్రతినిధుల ఎంపికలోనూ పంతాలకు పోతున్నారట. పెద్దల మధ్య తలదూర్చడం ఎందుకని అనుకున్నారో ఏమో.. ఎంపిక ప్రక్రియను ఆపేశారు యూనియన్ ప్రతినిధులు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్ష పదవుల కోసం టీఆర్ఎస్ పోటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో యూనియన్ పదవుల పంపకం వివాదంగా మారింది. TBGKSలో రెండు ఉపాధ్యక్ష పదవుల కోసం అధికారపార్టీ…
ఏపీలో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో రోడ్డెక్కే ప్రయత్నం చేశారు టీడీపీ చీఫ్. రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో నేతలు.. కార్యకర్తల్లో చురుకు పుట్టించాలని అనుకున్నారు. కానీ.. అధినేత ఒకటి తలిస్తే.. జిల్లాల్లో తమ్ముళ్లు చేసింది మరొకటి. పవర్లో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో అధికారం అనుభవించిన వారు.. రోడ్డెక్కేవేళ పత్తా లేకుండా పోయారట. అదే టీడీపీ శిబిరంలో హాట్ టాపిక్గా మారింది. 175 నియోజకవర్గాల్లో దీక్షలకు టీడీపీ ప్లాన్ కోవిడ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్తో టీడీపీ ఏపీవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.…
తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్డౌన్ ఎత్తేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు ఎప్పటిలా కొనసాగుతున్నాయి. GHMC కౌన్సిల్ సమావేశం మాత్రం ఆన్లైన్లో నిర్వహించారు. అన్లాక్లో ఎందుకు వర్చువల్ మీటింగ్ పెట్టారు? విపక్షాల విమర్శలేంటి? ఆన్లైన్ కౌన్సిల్ మీటింగ్ లోగుట్టు ఏంటి? వర్చువల్గా ముగిసిన జీహెచ్ఎంసీ తొలి కౌన్సిల్ భేటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా GHMC కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్లో విస్తృతంగా చర్చించి ఆయా అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.…
పార్టీ అధికారంలో లేకపోయినా.. ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య వర్గపోరు మాత్రం ఓ రేంజ్లో ఉంది. కేడర్కు సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారట అక్కడ ఎమ్మెల్యే. ఊరిలో పల్లకీ మోత.. ఇంట్లో ఈగల మోతగా మారి ఇబ్బంది పడుతున్నారట. చివరకు ఇంటిపోరు భరించలేక నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎమ్మెల్యే వీరయ్య చెప్పినా వినని పార్టీ కేడర్ పొదెం వీరయ్య. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇప్పుడు కొత్తగా…
అన్నవరం ఆలయంలో రెండు దశాబ్దాలుగా ఆయన చెప్పిందే వేదమట. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నా.. ఆయన మాటకు తిరుగే లేదట. రిటైరైన మరుసటిరోజే కొత్త పదవి చేపట్టి.. పెత్తనం చేయడానికి వస్తున్నారని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ రత్నగిరి కొండపై ఈ కొత్త రగడ ఏంటి? వ్రత పురోహితులకు కామేశ్వరరావు చెప్పిందే వేదం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఉద్యోగులతోపాటు.. అర్చకులు.. పురోహితులు.. సిద్ధాంతులు.. ఇలా ఎంతో మంది.. ఎన్నో విభాగాలు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం…
పీసీసీ పదవుల పందేరంలో ఆ జిల్లా నేతలకు ఎందుకంత ప్రాధాన్యం లభించింది? గత ఎన్నికల తర్వాత సైలెంట్ అయినప్పటికీ వారికి కలిసొచ్చిన సమీకరణాలేంటి? ఇప్పటికైనా యాక్టివ్గా పనిచేస్తారా? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురికి పీసీసీలో కీలక పదవులు ఒకప్పుడు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండేది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకటి రెండుచోట్ల మినహా దాదాపు అన్ని సీట్లు తన ఖాతాలో వేసుకునేది. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నాయకుల…
వైసీపీ ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారా? వెనకా ముందు ఆలోచించకుండా నోటికి పని చెబుతున్నారా? ఓ ఎమ్మెల్యే కీలకమైన ఒక సామాజికవర్గాన్ని తాగుబోతులని కించపరిచారు. మరో ఎమ్మెల్యే ఏకంగా తమ నాయకుడు ప్రవేశపెట్టిన పథకాన్నే అపహాస్యం చేసి.. ప్రత్యర్థులకు బోల్డంత కంటెంట్ ఇచ్చారు. నేతల ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారిందా? కాపు సామాజికవర్గంపై అంబటి అనుచిత వ్యాఖ్యలు ఎంత తోస్తే అంత.. పద్ధతీ పాడు లేకుండా మాట్లాడేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. కావడానికి సీనియర్ నాయకులే అయినప్పటికీ పార్టీని..…