అయినవాళ్లకు ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్నట్టుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీరు. ఐదేళ్ల తర్వాత డిపార్ట్మెంట్లో అందరికీ ప్రమోషన్లు ఇచ్చి కేవలం ఏడుగురికే రహస్యంగా కీలక పోస్టింగ్లు ఇవ్వడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. అదనపు బాధ్యతల పేరుతో కొందరు ఐదేసీ పోస్టులను పర్యవే క్షించడం.. 6 నెలలుగా ఎంతోమందిని పెండింగ్లో పెట్టడం వివాదం అవుతోంది. ఇంతకీ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతోంది? ఎక్సైజ్శాఖలో పదోన్నతులు వచ్చినా పాతచోటే పని! ఈ ఏడాది జనవరిలో తెలంగాణ…
అప్పు పుట్టేదెలా? ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. కొంతకాలంగా ఏదోరకంగా రుణం తేవడం.. బండి నడిపించడం ఆర్థికశాఖ అధికారులకు అలవాటైంది. ఇప్పుడు కేంద్రం పరిమితులు విధించింది. భారీగా కోత పెట్టింది. మరి.. ఇప్పుడెలా? ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఈ ఆర్థిక సంవత్సరం రూ.42,472 కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయం! ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా.. సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా వెనకాడకుండా గట్టిగానే ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో అప్పుల కోసం…
జై శ్రీరాం నినాదం లేకుండా బీజేపీ నేతల ప్రసంగాలను ఊహించలేం. కాషాయ కండువా కప్పుకొనేవాళ్లు ఎవరైనా.. కొత్తలో కొంత ఇబ్బంది పడినా తర్వాత ఇలాంటి స్లోగన్స్కు అలవాటు పడతారు. కానీ.. ఆ మాజీ మంత్రికి ఇంకా బీజేపీ బాడీ లాంగ్వేజ్ వంటబట్టలేదట. కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ వల్లో ఏమో.. ఆయన తీరు వినూత్నంగా ఉందట. అదే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఈటల నోటివెంటరాని జైశ్రీరాం నినాదం! ఈటెల రాజేందర్. మాజీ…
పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ఏపీ పరిపాలనలో ప్రస్తుతం ఆ రుచులపైనే చర్చ జరుగుతోంది. ఉత్తరాది వారి హవా ఎక్కువగా ఉందనే చర్చ జోరందుకుంది. IAS, IPSలతోపాటు.. కీలక పదవుల్లో సైతం రిటైరైన ఉత్తారాది అధికారుల పేర్లే వినిపిస్తున్నాయట. అదేలాగో ఇప్పుడు చూద్దాం. నార్త్ వర్సెస్ సౌత్ అంశంపై ఏపీలో ఆసక్తికర చర్చ పరిపాలనలో నార్త్ వర్సెస్ సౌత్ అనేది గతంలో ఉంది.. ఇప్పుడూ ఉంది. ప్రభుత్వంలో కీలక స్థానాలు లేదా ఫోకస్ ఉండే శాఖల్లో ఉత్తరాది…
మంత్రిగారి ఇలాకాలో తనిఖీలు లేదా దాడులు చేయాలంటే అధికారులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఆ అమాత్యుడి నియోజకవర్గంలో ఏకంగా ACB ఎంట్రీ ఇచ్చింది. ప్రతి రికార్డును నిశితంగా పరిశీలించడంతో ఒక్కటే గగ్గోలు.. ఉద్యోగవర్గాల్లో కలకలం. కానీ.. ACB దాడుల వెనక అసలు సంగతి వేరే ఉందట. అదే అక్కడ హాట్ టాపిక్! బందర్ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలపై చర్చ! ఇటీవల కృష్ణా జిల్లా బందరు మున్సిపాల్టీలో పెద్దఎత్తున ఏసీబీ సోదాలు జరిగాయి. మున్సిపల్ రికార్డులను తనిఖీలు…
ప్రస్తుతం దేశంలో కాకలుతీరిన రాజకీయ నాయకుల కంటే.. వ్యూహకర్తలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్ టాప్లో ఉంటే.. ఇప్పుడు ఆయన శిష్య బృందానికి సైతం గిరాకీ పెరిగింది. తెలంగాణలో రాజకీయంగా నిలబడాలని చూస్తోన్న YS షర్మిల.. ఆ బృందంలో నుంచి ఒకరిని వ్యూహకర్తగా ఎంచుకున్నారట. ఆ వ్యూహకర్త సూచనలతో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారట. షర్మిల పార్టీ వ్యూహకర్తగా పీకే టీమ్లోని ప్రియ! ఈ నెల 8న తెలంగాణలో కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్న…
బీజేపీలో ఈటల చేరికతో రుసరుసలాడుతోన్న ఆ కమలనాథుడు.. పార్టీతో తెగతెంపులు చేసుకోబోతున్నారా? పక్కచూపులు చూస్తున్నారా? కమలానికి గుడ్బై చెప్పడమే మిగిలిందా? ఇంతకీ ఎవరా నాయకుడు? రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? బీజేపీకి గుడ్బై చెప్పబోతున్నారా? బీజేపీలో కొత్తగా చేరిన వెటరన్స్ పక్కచూపులు చూస్తున్నారట. పార్టీ నుండి జారుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్టు సమాచారం. ఈ జాబితాలో మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఆయన కమల పార్టీని వదిలేసినట్టేనని బీజేపీ వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయట.…
తెలంగాణలో కొందరు ఐఏఎస్ల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ట్రాన్స్ఫర్ అవుతారు కానీ.. పోస్టింగ్ ఉండదు. ఏడెనిమిది నెలలుగా ఇదే దుస్థితి. కలెక్టర్లుగా బిజీగా పనిచేసిన వారు రోజుల తరబడి వర్క్ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. అలాంటి ఆఫీసర్లపై అధికారవర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. కలెక్టర్లుగా పనిచేసిన వారికి ఏడెనిమిది నెలలుగా పోస్టింగ్ లేదు సాధారణంగా ఒక IASను ఒక పోస్ట్ నుండి బదిలీ చేస్తే మరోచోట పోస్టింగ్ ఇస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ఆ టైమ్లో కొత్తచోట అడ్జస్ట్…
పోడు భూముల సమస్య అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు తలపోటుగా మారింది. సీజన్ వస్తే చాలు.. అటవీ అధికారులతో లడాయి తప్పడం లేదు. ఆగ్రహావేశాలు.. దాడులు.. ఉద్రిక్తతలు రొటీన్ అయిపోయాయి. సమస్యను రాజకీయం చేయడానికి విపక్షాలు చూస్తుండటంతో మరింత టెన్షన్ పడుతున్నారట టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. శాంతిభద్రతల సమస్యగా పోడు భూముల రగడ అటవీ అధికారులు.. గిరిజనులకు మధ్య పోడు భూములపై రగడ పాతదే. కానీ.. ఎప్పటికప్పుడు కొత్తగా తెరపైకి వస్తుంది. అడవినే నమ్ముకున్న తాము పోడు వ్యవసాయం చేసుకుంటే తప్పేంటని…
ఐదు దశాబ్దాలుగా నలుగుతోన్న బ్యారేజ్ అంశంపై ఎట్టకేలకు ట్రైబ్యునల్ నుంచి సానుకూల తీర్పు వచ్చింది. ఆ తీర్పుతో ఖుషీ అయ్యారు అధికార పార్టీ నాయకులు. ఆ విజయం తమదే అని ప్రచారం చేసుకున్నారు కూడా. త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ఎక్కడి వారు అక్కడే గప్చుప్. ఇంతకీ నేతలకు మింగుడు పడని అంశాలేంటి? దశాబ్దాల కల.. కలేనా? 1961లోనే నేరడి బ్యారేజీ కోసం శంకుస్థాపన నేరడి బ్యారేజ్.…