తెలంగాణలో నలుగురు కొత్త పోలీస్ కమిషనర్లు దూకుడు పెంచారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త బాస్ లు వచ్చాక కొత్త పనులు జరగటం సహజమే. తెలంగాణలో నలుగురు కొత్త పోలీస్ కమీషనర్ లు దూకుడు పెంచారట. అధికారుల బదిలీలతో పాటు, విధినిర్వహణపై ఒత్తిడి కూడా పెంచారట. ఇది డిపార్ట్మెంట్ లో కలకలానికి కారణమైందట..
పోలీస్ డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఏ పోస్టింగ్ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఊహించని రీతిలో ప్రభుత్వం నాలుగు పోలీస్ కమిషనరేట్ లకు కొత్త గా అధికారులను నియమించింది. కొత్త కమిషనర్ లు వచ్చీ రాగానే దూకుడు పెంచారు. సిబ్బంది బదిలీలు మొదలు పెట్టడంతో, డిపార్ట్ మెంట్ లో కలకలం కనిపిస్తోంది.
Also Read
కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్ళిపోతుంది. పోలీస్ శాఖకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎస్పీ తో పాటు పోలీస్ కమిషనర్ రాగానే గతంలో పని చేసిన అధికారులను బదిలీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ప్రభుత్వం 4 పోలీస్ కమిషనరేట్ లకు కొత్తగా అధికారులను నియమించింది. కొన్నాళ్ళ క్రితం వరంగల్ పోలీస్ కమిషనర్ గా తరుణ్ జోషి నియమించింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా సత్యనారాయణ నియమించారు. రామగుండం పోలీస్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నలుగురు పోలీస్ కమిషనర్ లు వచ్చీ రాగానే దూకుడు పెంచారు.
కొత్త కమీషనర్ లు ఇప్పటికే పాత సిబ్బందికి మంగళం పాడుతున్నారట. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ బదిలీ ప్రక్రియ మొదలుపెట్టారు. చాలా కాలం నుంచి ఎక్కడో లూప్ లైన్ లో పనిచేస్తున్న అధికారులకు మంచి పోస్టింగ్ ఇచ్చారు. అటు పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు అధికారులంతా బదిలీ అయ్యారు. రామగుండం లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కరీంనగర్లో కూడా పాత అధికారుల్ని బదిలీ చేసి కొత్తవారికి పోస్టింగ్ ఇస్తున్నారు. ఇకపోతే ఊహించని రీతిలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఈ స్థానానికి స్టీఫెన్ రవీంద్ర ను తీసుకు వచ్చారు.
స్టీఫెన్ రవీంద్ర వచ్చీ రాగానే తన పనితీరును మొదలు పెట్టారు. చాలా వరకు స్టేషన్ ఇంచార్జి అధికారులు బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది పోలీసు అధికారులు రేంజ్ కు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. దీనికోసం అధికారులకు విన్నపాలు వెళ్తున్నట్టుగా సమాచారం. ఇటీవల కాలంలో స్టీఫెన్ రవీంద్ర లా అండ్ ఆర్డర్ సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ కేసులు పెరిగిపోయిన పోలీస్ స్టేషన్ల అధికారులకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. నిర్ణీత టైం లోగా కేసులను సాల్వ్ చేయాలని, చార్జిషీటు వేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు విచారణ పై దృష్టి పెట్టి వెంటనే కేసులను సాల్వ్ చేయాలని సైబరాబాద్ కొత్త కమీషనర్ ఆదేశించారట.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!