LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..
- పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారికి కేంద్రం షాక్..
- సిలిండర్ సరెండర్ చేయాలని ఆదేశాలు..
- కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు, రీఫిల్ బుకింగ్స్కు నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని పెంచుతోంది. యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు ‘‘పానిక్ బుకింగ్స్’’ చేస్తున్నారు. సాధారణం కన్నా ప్రతీ రోజు 25 లక్షల సిలిండర్లు ఎక్కువగా బుక్ అవుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రకటించింది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో చమురు, గ్యాస్ కొరత లేదని చెబుతోంది. అయినప్పటికీ, ప్రజల భయాలు ఇంకా తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే, ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కొందరికి షాక్ ఇచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ మరియు డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ రెండూ ఉన్నవారు రెండో దాన్ని సరెండర్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ప్రభుత్వ చమురు కంపెనీ లేదా పంపిణీదారుడు ద్వారా వారికి సిలిండర్ రీఫిల్ బుకింగ్స్ నిలిపేయాలని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
Read Also: Robin Uthappa: “ఇదే లాస్ట్”.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై రాబిన్ ఉతప్ప సంచలన ప్రకటన..
నోటిఫికేషన్ ప్రకారం.. ఇంట్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న కుటుంబాలు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ (సిలిండర్) కనెక్షన్ను వెంటనే సరెండర్ (వదులుకోవాలి) చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశించింది. పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై సిలిండర్ రీఫిల్స్ బుక్ చేయకూడదని, ప్రభుత్వ చమురు సంస్థల నుంచి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు తీసుకోవడంపై కేంద్రం నిషేధించింది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్ పేర్కొంది.
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు, గ్యా్స్ సరఫరాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగమతి చేసుకుంటుంది. ఇందులో 85-90 శాతం సౌదీ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. ఈ కారణంగా దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది.
తాజావార్తలు
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!