LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..
- పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారికి కేంద్రం షాక్..
- సిలిండర్ సరెండర్ చేయాలని ఆదేశాలు..
- కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు, రీఫిల్ బుకింగ్స్కు నో..
LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని పెంచుతోంది. యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు ‘‘పానిక్ బుకింగ్స్’’ చేస్తున్నారు. సాధారణం కన్నా ప్రతీ రోజు 25 లక్షల సిలిండర్లు ఎక్కువగా బుక్ అవుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రకటించింది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో చమురు, గ్యాస్ కొరత లేదని చెబుతోంది. అయినప్పటికీ, ప్రజల భయాలు ఇంకా తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే, ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కొందరికి షాక్ ఇచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ మరియు డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ రెండూ ఉన్నవారు రెండో దాన్ని సరెండర్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ప్రభుత్వ చమురు కంపెనీ లేదా పంపిణీదారుడు ద్వారా వారికి సిలిండర్ రీఫిల్ బుకింగ్స్ నిలిపేయాలని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Read Also: Robin Uthappa: “ఇదే లాస్ట్”.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై రాబిన్ ఉతప్ప సంచలన ప్రకటన..
నోటిఫికేషన్ ప్రకారం.. ఇంట్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న కుటుంబాలు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ (సిలిండర్) కనెక్షన్ను వెంటనే సరెండర్ (వదులుకోవాలి) చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశించింది. పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై సిలిండర్ రీఫిల్స్ బుక్ చేయకూడదని, ప్రభుత్వ చమురు సంస్థల నుంచి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు తీసుకోవడంపై కేంద్రం నిషేధించింది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్ పేర్కొంది.
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు, గ్యా్స్ సరఫరాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగమతి చేసుకుంటుంది. ఇందులో 85-90 శాతం సౌదీ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. ఈ కారణంగా దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!