LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..
- పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారికి కేంద్రం షాక్..
- సిలిండర్ సరెండర్ చేయాలని ఆదేశాలు..
- కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు, రీఫిల్ బుకింగ్స్కు నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని పెంచుతోంది. యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు ‘‘పానిక్ బుకింగ్స్’’ చేస్తున్నారు. సాధారణం కన్నా ప్రతీ రోజు 25 లక్షల సిలిండర్లు ఎక్కువగా బుక్ అవుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రకటించింది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో చమురు, గ్యాస్ కొరత లేదని చెబుతోంది. అయినప్పటికీ, ప్రజల భయాలు ఇంకా తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే, ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కొందరికి షాక్ ఇచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ మరియు డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ రెండూ ఉన్నవారు రెండో దాన్ని సరెండర్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ప్రభుత్వ చమురు కంపెనీ లేదా పంపిణీదారుడు ద్వారా వారికి సిలిండర్ రీఫిల్ బుకింగ్స్ నిలిపేయాలని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Robin Uthappa: “ఇదే లాస్ట్”.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై రాబిన్ ఉతప్ప సంచలన ప్రకటన..
నోటిఫికేషన్ ప్రకారం.. ఇంట్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న కుటుంబాలు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ (సిలిండర్) కనెక్షన్ను వెంటనే సరెండర్ (వదులుకోవాలి) చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశించింది. పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై సిలిండర్ రీఫిల్స్ బుక్ చేయకూడదని, ప్రభుత్వ చమురు సంస్థల నుంచి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు తీసుకోవడంపై కేంద్రం నిషేధించింది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్ పేర్కొంది.
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు, గ్యా్స్ సరఫరాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగమతి చేసుకుంటుంది. ఇందులో 85-90 శాతం సౌదీ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. ఈ కారణంగా దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!