ఆ ఎమ్మెల్యేలు టోటల్ అన్ హ్యాపీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెక్కలేనన్ని పథకాలు..నెలనెలా ఇంటికే డబ్బులు. ఇళ్లు, స్థలాలు..ఒకటేమిటి.. అసలు సిసలు సంక్షేమ రాజ్యం అంటే ఏంటో ఏపీలోనే చూడాలన్నట్టు ప్రభుత్వం ఉంది. అసంతృప్తి అనేదే లేని జనం మా దగ్గర ఉన్నారని అధికార పార్టీ ఘనంగా చెప్పుకుంటుంటే, పాపం ఎమ్మెల్యేలు మాత్రం లబోదిబో అంటున్నారట. ప్రజలంతా హ్యాపీగా ఉంటే ఎమ్మెల్యేలకు వచ్చిన ప్రాబ్లం ఏమిటనుకుంటున్నారా? అయితే చూడండి..
గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 2 సీటత్లు మినహీఆ అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ పథకాలు మహాజోరుగా అమలు చేస్తోంది. లక్షలాది ఇళ్లస్థలాల పంపిణీ మొదలు…అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలంతా హ్యాపీ. నేతలూ హ్యాపీ. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం టోటల్ అన్ హ్యాపీ. నిన్న మొన్నటి వరకు వాళ్లూ హ్యాపీస్ అనుకున్నారు. కానీ, వాళ్లు నోళ్లు విప్పితే కానీ, అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టు. ఒక్కో ఎమ్మెల్యే తను పడుతున్న సమస్యలను ఏకరువు పెట్టారు.
Also Read
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం డిఆర్సీలో అధికారుల నిర్లక్ష్యం పై నిప్పులు చెరిగారు అధికార పార్టీ ఎమ్మెల్యే లు… ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని పట్టుదలతో పని చేస్తుంటే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు సర్ది చెప్పలేక ఇన్చార్జి మంత్రి ఒక దశలో తీవ్ర అసహనానికి గురయ్యారు. నీటి విడుదల అంశంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కళకళలాడుతుంటే కాల్వ ల పై నాకాబంది పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. గ్రామాలకు వెళ్తున్న శాసనసభ్యులను పిచ్చోళ్లలా చూస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు బొల్ల బ్రహ్మనాయుడు.
అక్రమ రేషన్ మాఫియాపై సమావేశంలో నిప్పులు చెరిగారు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. తమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేషన్ మాఫియా తరలిస్తున్న బియ్యం పట్టు పడుతుందని ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఇస్తున్న రూపాయి బియ్యాన్ని మాఫియా కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అక్రమ అమ్మకాలకు పాల్పడుతుందని ఆవేదనచెందారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుండి డీలర్ వరకు అవినీతిమయం అయ్యారని వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. ఎమ్మెల్యేగా తాను చెప్తున్నా సివిల్ సప్లై అధికారులు అంతులేని నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. మరోవైపు కృష్ణా వరదల వల్ల డెల్టా ప్రాంతంలో హార్టికల్చర్ పంటలకు జరిగిన నష్టానికి అధికారులు ఇప్పటికీ నష్టపరిహార లెక్కలు కట్టలేదని వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఏకంగా ఇంఛార్జి మంత్రి వద్దే ఎమ్మెల్యేలు చెప్పడం చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!