మరో వివాదంలో మంత్రి జయరామ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తరచూ వివాదాల్లో చిక్కుకోవడం.. ఆనక పార్టీ పెద్దలతో తలంటించుకోవడం.. ఆ మంత్రికి కామనైపోయిందా? అప్పట్లో పేకాట.. బెంజ్ కారు.. ఇప్పుడు SIని బెదిరిస్తున్న వీడియో…! మళ్లీ పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోక తప్పదా? ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా కథ?
ఈ స్థాయిలో వరస వివాదాల్లో చిక్కుకున్న మరో మంత్రి లేరా?
Also Read
గుమ్మనూరు జయరామ్. ఏపీ కార్మిక శాఖ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరామ్.. మంత్రి అయ్యాక కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. ఏపీ కేబినెట్లో వరస వివాదాల్లో చిక్కుకున్న మంత్రి మరొకరు లేరనే చర్చ మొదలైంది. ఇప్పుడు వైరల్ అవుతున్న బెదిరింపు వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చారు జయరామ్. అంతేకాదు.. తాడేపల్లిలో పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోక తప్పదనే ప్రచారం జరుగుతోంది
పేకాట క్లబ్ నిర్వహణలో ఆరోపణలు
ఈఎస్ఐ స్కామ్లో బెంజ్ కారు నజరానా?
అప్పట్లో పేకాట క్లబ్ నిర్వహణ విషయంలో మంత్రి జయరామ్ పేరు మార్మోగింది. మంత్రి బంధువులపైనే పోలీసులు కేసు పెట్టారు. పైగా పేకాట స్థావరాలపై దాడులకు వచ్చిన పోలీసులపై మంత్రి అనుచరులు ఎదురుతిరగడం సంచలనంగా మారింది. ESI స్కామ్లో ఓ నిందితుడి నుంచి బెంజ్ కారును నజరానాగా పొందారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై పార్టీ పెద్దలకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు కూడా. ఆ సమయంలో మంత్రిగారికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది.
ట్రాక్టర్లను వదిలేయాలని ఎస్ఐని బెదిరించిన మంత్రి!
తాజాగా కొత్త వైరల్ వీడియోతో హెడ్లైన్స్కు కంటెంట్ అయ్యారు మంత్రి జయరామ్. నియోజకవర్గంలో తమవర్గం వారిని నాయకులు వెనకేసుకుని రావటం కామన్. కానీ.. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాని SIని బెదిరించారు మంత్రి. లేకపోతే మంత్రి అని కూడా చూడకుండా ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఒక మంత్రి ఈ తరహాలో అవినీతి పరులకు వత్తసు పలకడం.. SIని బెదిరించడం చర్చగా మారింది.
ఆలూరులో ఇసుక రీచ్లే లేవన్నది మంత్రి వాదన!
మంత్రి జయరామ్కు సంబంధించిన వ్యవహారాలపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఏమైందో ఏమో ఆలూరు ఉన్న మంత్రి అమరావతిలో కనిపించారు. ఇక్కడే పార్టీ వర్గాల్లో జోకులు పేలుతున్నాయి. సమీక్షలు, సమావేశాల కంటే.. మంత్రిగారు వివరణలు ఇచ్చుకోవడానికి వస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయని తాడేపల్లి సర్కిళ్లలో సెటైర్లు వినిపిస్తున్నాయి. మంత్రి మాత్రం.. ఆలూరులో ఇసుక రీచ్లు లేవని వాదిస్తున్నారు. రీచ్లే లేనప్పుడు అక్రమ ఇసుక తవ్వకాలకు ఆస్కారమే లేదన్నది ఆయన వివరణ. ఖాళీ ట్రాక్టర్లను పట్టుకుని రైతులను పోలీసులు ఇబ్బంది పెడుతుంటే ప్రజాప్రతినిధిగా స్పందించానని మంత్రి జయరామ్ చెబుతున్నారు. అయితే ఒకసారి బెదిరింపు వీడియో వైరల్ అయ్యాక ఎన్ని వివరణలు ఇచ్చినా.. చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టే అవుతుందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మరి.. మంత్రిగారి వివరణ ఇస్తే దానిపై తాడేపల్లి వర్గాల రియాక్షన్ ఏంటో చూడాలి.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!