Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ys Memorial Meeting Held In Telangana Congress

తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన వైఎస్ సంస్మరణ సభ !

Published Date :September 4, 2021 , 8:36 pm
By Lakshmi Narayana
తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన వైఎస్ సంస్మరణ సభ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ను ఓన్‌ చేసుకున్నారా.. లేదా? పన్నెండేళ్ల తర్వాత మొదలైన ఈ చర్చలో కాంగ్రెస్‌ వర్గాల్లో భిన్న వాదనలు ఉన్నాయా? ఇంతకీ YSR ఎవరి మనిషి? ఇప్పుడెందుకీ రచ్చ!

వైఎస్‌ సంస్మరణ సభతో దివంగత సీఎం ఇమేజ్‌పై చర్చ!

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
  • Off The Record: తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను శాసించిన వ్యక్తి దివగంత సీఎం డాక్టర్‌ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో ఈ అంశంపై రగడ లేకపోయినా.. తెలంగాణలోనే కొంత జంఝాటనం కనిపిస్తోంది. కాంగ్రెస్‌, షర్మిల పార్టీల మధ్య ఫైట్‌ మొదలైంది. వైఎస్‌ను కాంగ్రెస్‌ మనిషి అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో షర్మిల వారసురాలిగా బరిలోకి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన YS సంస్మరణ సభతో ఆయన ఇమేజ్‌పై మళ్లీ చర్చ స్టార్ట్‌ అయింది.

వైఎస్‌ను కాంగ్రెస్‌ మనిషిగా చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు!

వైఎస్‌ వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నది కుటుంబ సభ్యులు చెప్పేమాట. ఈ విషయంలో కాంగ్రెస్‌ నాయకుల వాదన మరోలా ఉంది. వైఎస్‌ కాంగ్రెస్‌ మనిషి. కాంగ్రెస్‌ ఆయనకు అవకాశం ఇవ్వడం వల్లే సీఎం పదవి చేపట్టారని చెబుతున్నారు. వైఎస్‌కు నిజమైన వారసులం తామేనని బలంగా వాదిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. వైఎస్‌ కుటుంబ సభ్యులు కేవలం ఆయన ఆస్తులకు మాత్రమే వారసులని చెబుతున్నారు. ఇక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. కొత్త స్లోగన్‌ అందుకున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు.

కాంగ్రెస్‌, షర్మిల పార్టీల మధ్య వైఎస్‌ ఇమేజ్‌ కోసం ఫైట్‌!

రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలన్నది వైఎస్‌ చివరి కోరికగా కాంగ్రెస్‌ నాయకులు చర్చకు పెట్టారు. ఆ కోరిక నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ఇందుకు కలిసి వచ్చేవారు కాంగ్రెస్‌కు మిత్రులు.. అడ్డుకునేవారు శత్రువులు అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల కొత్త పార్టీ ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఇమేజ్‌ ఫైట్‌ రెండు పార్టీల మధ్య గట్టిగానే సాగుతోంది. వైఎస్‌ సంస్మరణ సభకు వెళ్లొద్దని కాంగ్రెస్‌ స్పష్టం చేసినా.. ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. ఉదయం గాంధీభవన్‌లో వైఎస్‌కు నివాళులు అర్పించిన నాయకులే.. సాయంత్రం వైఎస్‌ సతీమణి ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు వెళ్లొద్దనడంపై పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు YSకు ఎస్‌ చెబుతున్నారో నో అంటున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

వైఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ నిలకడలేని ప్రకటనలు?

పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. వైఎస్‌ను కాంగ్రెస్‌ మనిషిగా చెప్పడం.. వెంటనే గొంతు సవరించుకుంటూ మరో ప్రకటన చేయడంపై కాంగ్రెస్‌ వర్గాల్లోనే ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. వైఎస్‌ తెలంగాణకు వ్యతిరేకి అని వైరి పక్షాలు పదే పదే ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్‌ నాయకులు ఆయన్ని ఓన్‌ చేసుకోవడానికి వెనకంజ వేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. షర్మిల పార్టీ జనాల్లో వైఎస్‌ పేరుతోనే వెళ్తోంది. మరి.. రానున్న రోజుల్లో రెండు పార్టీల మధ్య YSను ఓన్‌ చేసుకునే విషయంలో ఇంకెలాంటి చర్చ జరుగుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Party
  • off the record
  • telagnana
  • TPCC chief Revanth Reddy
  • YS Rajashekar reddy

తాజావార్తలు

  • Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..

  • IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్‌పై సంచలన ఆరోపణలు.. స్లాప్‌గేట్ మళ్లీ వార్తల్లో

  • AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?

  • Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!

  • Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions