Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల MLC అభ్యర్థిగా వైసీపీ నర్తు రామారావును ఎంపిక చేసింది. లోకల్ బాడీలో వైసీపీకి పూర్తిస్థాయి బలం ఉండటంతో నర్తు నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే అని అనుకున్నారు. నర్తు రామారావు యాదవ సామాజికవర్గం నాయకుడు. అయితే ఈ ఎమ్మెల్సీ సీటును ఆశించారు వైసీపీలోని తూర్పుకాపు సామాజికవర్గం నేతలు. ఇప్పుడు సీటు రాకపోవడంతో రెబల్గా మారారు. స్వతంత్ర అభ్యర్ధిని బరిలో దించడంతో రాజకీయం మలుపు తీసుకుంది. తూర్పుకాపు సామాజికవర్గానికి…
Off The Record: తిరుమల మినహా ప్రభుత్వ అధీనంలోని ఇతర ఆలయాలన్నీ ఏపీలోని దేవాదాయశాఖ మంత్రి అజమాయిషీలోనే ఉంటాయి. మినిస్టర్గా ఆ ఆలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేయొచ్చు. కానీ.. డిప్యూటీ సీఎం హోదాలో దేవాదాయశాఖ చూస్తోన్న కొట్టు సత్యనారాయణ పరిస్థితి మాత్రం వేరే విధంగా ఉంది. తిరుమలలోనే కాదు.. ఏపీలోని మరో ఆలయంలో కూడా కొట్టు మాట చెల్లుబాటు కావడం లేదట. అదే బెజవాడ కనకదుర్గ ఆలయం. ఈ గుడిలో మంత్రి కొట్టు…
Off The Record: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. CWCలో చోటు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలోని పార్టీ నేతలు. CWC అనేది పార్టీలో కీలక కమిటీ. ఇంతలో రాయ్పూర్ కాంగ్రెస్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. వాస్తవానికి రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్గా వచ్చాక.. ఆయనతో చాలా మంది సీనియర్లకు పడటం లేదు. రేవంత్ను వ్యతిరేకించేవాళ్లంతా AICCలో పదవులు ఆశిస్తున్నారు. హైకమాండ్ మూడ్ కూడా అలాగే ఉందనే చర్చ…
Off The Record: రెండు దశాబ్దాలపాటు వైద్యుడిగా సేవలందించి.. ప్రస్తుతం అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ అబ్రహం.. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో అలంపూర్ సీటు SCలకు రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డితో ఉన్న పరిచయాలు ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగపడ్డాయి. తర్వాత టీడీపీలోకి వెళ్లి పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. అలంపూర్లో ఈస్థాయిలో…
Off The Record: ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాతోపాటు స్థానిక సంస్థల కేటగిరిలో 18 సీట్లకు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించింది. 18లో ఏకంగా 14 సీట్లను SC, ST, BCలకే కేటాయించారు. అందులోనూ 11 స్థానాలను కేవలం BC సామాజికవర్గాలకే ఇచ్చారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం, స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉన్న పట్టు రీత్యా ఈ రెండు కోటాల్లోనూ అభ్యర్థుల గెలుపు లాంఛనమే. శాసనమండలికి ఇంత పెద్దఎత్తున బీసీలను పంపించటం…
Off The Record: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్రెడ్డి, సీతా దయాకర్రెడ్డి. ప్రస్తుతం ఈ దంపతుల ఫొటోలతో వేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అసమర్దుల, అవినీతి పరుల చేతిలో బందీ అయిన మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల సంకెళ్లు తెంచాలని ఆ పోస్టర్లలో రాశారు. పూర్వవైభవం తెచ్చేందుకు మళ్లీ మీరు రావాలి అని రెండు సెగ్మెంట్లలో పోస్టర్లను అంటించారు. ఈ పోస్టర్ల వెనుక మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందా? వాళ్ల…
Off The Record: డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం. తిరుపతిలోని రష్ ఆస్పత్రి అధినేత. తాజాగా ఆయన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. నిన్న మొన్నటి వరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు ఈ సిపాయి. ఈ మధ్యే టీడీపీ పదవికి.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏ పార్టీలోనూ సిపాయి చేరింది లేదు. ఇంతలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా…
Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గెలిస్తే.. నర్సీపట్నంలో ఓడిపోయారు అయ్యన్న పాత్రుడు. ఎమ్మెల్యేగా గెలిచిన గంటా రాజకీయ పరిస్థితుల వల్ల మూడున్నరేళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. అసలు టీడీపీలో ఉంటారో లేదో అన్నట్టుగా అనేక ప్రచారాలు జరిగాయి. ఇదే సమయంలో అయ్యన్నపాత్రుడు మాత్రం టీడీపీ స్వరం గట్టిగానే వినిపించారు. అవకాశం వస్తే అధికారపార్టీపై ఒంటికాలిపై లేచి రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఇంకా ఎదుర్కొంటున్నారు…
Off The Record: ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది అధికార పార్టీ. అమలాపురం నియోజకవర్గానికి చెందిన ఇజ్రాయెల్కి ఎమ్మెల్యే కోటాలో.. శెట్టిబలిజ సంఘం నేత కుడుపూడి సూర్యనారాయణకు స్థానిక సంస్థల కోటాలో ఛాన్స్ ఇచ్చారు. అమలాపురం అల్లర్లు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాదిగ, శెట్టిబలిజ సామాజికవర్గాలను దగ్గర చేసుకోవడానికి ఆ విధంగా వ్యవహరించింది. అయితే గవర్నర్ కోటాలో జిల్లాలో కాపులకు అవకాశం ఇద్దామనే ఆలోచన సాగిందట. దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ జరిగినా..…
Off The Record: తెలంగాణలోని హాట్ సీటుల్లో దుబ్బాక నియోజకవర్గం కూడా ఒకటి. 2018 ఎన్నికల వరకు ఇదో సాధారణ సెగ్మెంటే అయినా… తర్వాత జరిగిన ఉపఎన్నికతో ఎక్కడలేని హైప్ వచ్చేసింది. దాంతో దుబ్బాకలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పార్టీలో ఏం జరిగినా హాట్ టాపిక్గా మారుతోంది. తాజాగా దుబ్బాక కాంగ్రెస్లో నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీలో గందరగోళానికి దారితీస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎవరికివారు టికెట్ తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు. దుబ్బాక కాంగ్రెస్ ఇంఛార్జ్గా ఉన్న…