ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఆ అక్కచెల్లెళ్ళ మధ్య ఏదో జరుగుతోందా? ఇబ్బంది వచ్చినప్పుడు కూడా కనీసం ఒకర్ని ఒకరు పరామర్శించుకోలేనంత అగాధం పెరిగిపోయిందా? సినిమా, రాజకీయం కలగలిసిపోయినట్టుగా ఉండే ఆ సిస్టర్స్ ఎవరు? వాళ్ళ మధ్య సఖ్యత లేదన్న అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుముడతాయో… లేక ఆమే వివాదాలను వెతుక్కుంటూ వెళ్తారో తెలీదుగానీ… ఎప్పుడూ ఏదోఒక వివాదాస్పద టాపిక్తో చర్చల్లో వుంటున్నారు ఆమె.…
Story Board : హైదరాబాద్ చుట్టూ డేంజర్ జోన్ ఏర్పడింది. సిటీ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌసులు, రిసార్టుల్లో తరచుగా డ్రగ్స్, రేవ్ పార్టీలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు మంగ్లీ బర్త్ డే పార్టీ రచ్చతో మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది. వీటికి తోడుగా సిటీలో పబ్ కల్చర్ ఉండనే ఉంది. నగరం నిద్రపోతున్నవేళ జరిగే కార్యకలాపాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. Harish Rao : ఇది మార్పా రేవంత్…
Telangana Cabinet: రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. నిన్న ఢిల్లీకి వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. ఈరోజు రాత్రికి హైదరాబాద్ రానున్నారు. అయితే, కొత్తగా కేబినెట్ లోకి ముగ్గురిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
ఆ వైసీపీ సీనియర్ లీడర్… కూటమి ప్రభుత్వాన్ని బాగా డిస్ట్రబ్ చేస్తున్నారా? ఆ మధ్య కొన్నాళ్ళు కామ్ అయిన నాయకుడు తిరిగి గొంతు సవరించుకోవడాన్ని ప్రభుత్వ పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారా? ఎక్కువ మాట్లాడుతున్నాడు… లోపలేసేయండని అంటున్నారా? ఆయనకు సంబంధించిన లూప్హోల్స్ వెదకమని కొందరికి బాధ్యత అప్పగించారా? ఎవరా నాయకుడు? ఏంటా వ్యవహారం? పేర్ని నాని… మాజీ మంత్రి, కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి, జనసేనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ నాయకుల్లో…
తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ విషయంలో క్లారిటీ వచ్చినట్టేనా? ఆ విషయంలో ఇన్నాళ్ళుగా ఉన్న సన్నాయి నొక్కుళ్ళకు తెరపడినట్టేనా? అభయ్ పాటిల్ విషయంలో అసలు వివాదం ఎక్కడుంది? ఆయనంటే తెలంగాణ బీజేపీ లీడర్స్ ఎందుకు భయపడుతున్నారు? పాటిల్ తనదైన శైలిలో పనిచేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జ్గా వచ్చారు కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్. ఆ తర్వాత ఆయన్నే… రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా పూర్తి స్థాయిలో నియమించింది పార్టీ హైకమాండ్. కానీ… ఆ…
ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలంతా… ఆ ఎంపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎక్కడో స్విచ్చేస్తే… అక్కడ బల్బ్ వెలుగుతోందా..? అన్న-తమ్ముడు అనుకుంటూనే.. ఎందుకు లడాయి పెట్టుకుంటున్నారు? క్రమశిక్షణ అన్నది బ్రహ్మ పదార్ధంలా మారిపోయిందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? కీచులాడుకుంటున్న ఆ నాయకులెవరు? ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్కి చేరింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు ఆందోళన, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుల దాకా వచ్చేసింది వ్యవహారం. ఎంపీ మల్లు రవి టార్గెట్గా… పాలమూరు…
వెన్నుపోటు దినం ర్యాలీలు వైసీపీకి మాంఛి కిక్కు ఇచ్చాయా? ఆ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అని పార్టీ అధిష్టానం భావిస్తోందా? అందుకే సీక్వెల్ను సిద్ధం చేస్తోందా? ఏంటా కొనసాగింపు కార్యక్రమాలు? పార్టీ అధిష్టామం మనసులో ఏముంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఏడాది పూర్తయినా ఎన్నికల హామీలను మాత్రం అమలు చేయలేదంటూ ఆందోళన బాట పట్టింది వైసీపీ. ఫలితాలు వెలువడ్డ జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. నాడు…
ఎమ్మెల్సీ కవిత ఇక రాజకీయంగా ఒంటరేనా? ఆమె పొలిటికల్ స్టెప్స్ అన్నీ ఇక సోలోగా పడాల్సిందేనా? గులాబీ వాసన ఇక ఆమె దరిదాపులకు కూడా చేరదా? లేఖ రాజేసిన అగ్గి అంతకంతకూ అంటుకుంటోందా? తాజాగా నిజామాబాద్ టూర్ ఆ విషయాన్నే చెప్పేసిందా? అసలేం జరిగింది నిజామాబాద్లో? ఆమె పొలిటికల్ ఒంటరి అని ఎందుకు స్టాంప్ వేసేస్తున్నారు అంతా? మొన్నటి దాకా…. బీఆర్ఎస్లో ఆమె మాటకు తిరుగులేదు. అక్క నోటి నుంచి మాట రావడమే ఆలస్యం… ఆచరణలో పెట్టేందుకు…
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది పాస్? ఎందరు ఫెయిల్? ఏడాది పాలనలో ఎవరెవరి తీరు ఎలా ఉంది? మేటర్ తేల్చడానికి పార్టీ అధిష్టానం ఏం చేస్తోంది? ఆల్రెడీ ఎవరేంటో తేల్చే పని మొదలైందా? రిపోర్ట్ని బట్టి ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదా? ఎమ్మెల్యేల ప్రోగ్సెస్ కార్డ్పై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైంది. గతంలో కనీవినీ ఎరుగని మెజార్టీతో మూడు పార్టీలు కలిసి అధికారం చేపట్టాయి. ఆ బలం ఇచ్చిన కిక్కుతోనే……
పచ్చని పల్లెల్లో ఇథనాల్ చిచ్చుపెడుతోంది. కంపెనీ మళ్లీ పనులు స్టార్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఉద్యమిస్తున్న రైతులకు మేమున్నామంటూ అభయం ఇచ్చిన రాజకీయ నేతలు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. ఇంతకీ…ఇథనాల్ కంపెనీ రగడ వెనుక ఎవరున్నారు? గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వివాదం చెలరేగుతోంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివారులో 29 ఎకరాల్లో 189 కోట్ల రూపాయలతో గాయత్రీ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ఇథనాల్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వంలో 2023…