నిటారైన విగ్రహం, నటనలో నిగ్రహం, వాచకంలో వైవిధ్యం వెరసి ముక్కామల కృష్ణమూర్తిని విలక్షణ నటునిగా నిలిపాయి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ముక్కామల. హీరోగా, విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా మెప్పించారాయన. తెలుగువారి హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించారు ముక్కామల. ముక్కామల కృష్ణమూర్తి 1920 ఫిబ్రవరి 28న గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ ముక్కామల సుబ్బారావు, తల్లి సీతారావమ్మ. ముక్కామల కన్నవారికి కళలంటే…
ఎన్టీఆర్ కేంద్రంగా కృష్ణా జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్టీఆర్ పేరు.. ఎన్టీఆర్ ఊరు అనే కాన్సెప్ట్తో వైసీపీ అడుగులు పడుతున్నాయి. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. తాజాగా నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చగా మారింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్NTR.. కృష్ణా జిల్లాలో ఈ పేరు చుట్టూనే రాజకీయం జరుగుతోంది. ఎన్టీఆర్ను ఎవరికి వారు ఓన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.…
గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక స్టార్ గా ఎదిగినప్పటికీ ఆయన ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ కు అశేషాభిమానాన్ని సంపాదించి పెట్టింది. కాగా పునీత్ చివరి చిత్రం “జేమ్స్” మార్చి 17న ఆయన జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది. టాలీవుడ్ నటులలో ఎన్టీఆర్, పునీత్ కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు…
టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేస్తే చంద్రబాబు డొంక కదులుతుందనే భయంతోనే లోకేష్ వైజాగ్ వచ్చారన్నారు. టీడీపీ హయాంలో చేసిన గంజాయి సాగు లావాదేవీలు, అక్రమాలు బయట పడతాయని భయంతో విశాఖ వచ్చారు అని విమర్శించారు అమర్నాథ్. 41 నోటీసు ఇస్తే ఎందుకు ఉలికి పాటు. రాజ్యాంగంలో వున్న పెద్దలపై తప్పుడు మాటలు మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాగుబోతు కారు నడిపితే, పిచ్చోడి…
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. వరుస సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో ఆమెకు ఆమే సాటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాన్వీ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో…
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఇప్పుడు తన ఆరాధ్యుడు నందమూరి తారక రామారావును గుర్తుచేస్తున్నారు. ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించింది. అదే ఏడాది మే 28న తన పుట్టిన రోజు నాడు విజయవాడలో విపక్షాలతో మహా రాజకీయ సదస్సు నిర్వహించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక ఐక్యకూటమి ప్రయత్నాలకు అది మరో ఆరంభం. 1983లోనే కర్నాటకలో రామకృష్ణ హెగ్డే సారధ్యంలో జనతా పార్టీ ప్రభుత్వం…
(ఫిబ్రవరి 20న టి.వి.రాజు వర్ధంతి)టి.వి.రాజు – ఈ పేరు ఆ నాటి సంగీతాభిమానులకు మరపురాని మధురం పంచింది. టి.వి.రాజు ఉత్తరాది బాణీలను అనుకరిస్తారని పేరున్నా, వాటిలోనూ తనదైన బాణీ పలికిస్తూ తెలుగువారికి ఆనందం పంచారాయన. టి.వి.రాజు పేరు వినగానే మనకు మహానటుడు యన్.టి.రామారావు చప్పున గుర్తుకు వస్తారు. ఎందుకంటే రాజు స్వరకల్పనలో సింహభాగం యన్టీఆర్ చిత్రాలే కావడం కారణం. టి.వి.రాజు పూర్తి పేరు తోటకూర వెంకటరాజు. 1921 అక్టోబర్ 25న రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురంలో టి.వి.రాజు జన్మించారు.…
(ఫిబ్రవరి 20న ‘భాగ్యరేఖ’కు 65 ఏళ్ళు)పట్టుమని డజన్ సినిమాలు తీయలేదు. కానీ, దర్శకదిగ్గజం బి.యన్. రెడ్డి పేరు తెలుగు చలనచిత్రసీమలో సువర్ణాక్షర లిఖితమయింది. దక్షిణ భారతంలో తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఘన చరిత బి.యన్. రెడ్డి సొంతం. ఆయన రూపొందించిన చిత్రాలలో “మల్లీశ్వరి, రాజమకుటం” చిత్రాలు మినహాయిస్తే అన్నీ సాంఘికాలే. ఈ రెండు సినిమాల్లోనూ యన్.టి.రామారావు కథానాయకుడు కావడం విశేషం. యన్టీఆర్ తో బి.యన్. రెడ్డి తెరకెక్కించిన ఏకైక సాంఘిక చిత్రం ‘భాగ్యరేఖ’. 1957…
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్-పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామ్ చరణ్తో కియారా రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు.…
“ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల సమయానికే ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. పలు వాయిదాల అనంతరం సినిమాను ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో సమస్య మేకర్స్ని కలవరపెడుతోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్లను పరీక్షా సీజన్లుగా పరిగణిస్తారు. అందువల్ల పెద్ద సినిమాలు ఆ సమయంలో ఎక్కువగా విడుదల కావు. అయితే ఈ సంవత్సరం మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే కోవిడ్-19 థర్డ్ వేవ్ కారణంగా జనవరిలో…