Iran-US: ఇరాన్పై దాడిని తీవ్రం చేసిన అమెరికా.. బీ-2 బాంబర్లతో దాడి
- మధ్యప్రాచ్యంలో చేజారిపోతున్న పరిస్థితులు
- ఇరాన్పై దాడిని తీవ్రం చేసిన అమెరికా
- బీ-2 బాంబర్లతో దాడికా
- బాలిస్టిక్ మిస్సైల్ లాంఛర్లే లక్ష్యంగా అమెరికా దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత చేజారిపోతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇలా ఇరు వర్గాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి.
తాజాగా అమెరికా దాడులను మరింత తీవ్రం చేసింది. ఇరాన్పై అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను ప్రయోగిస్తోంది. బాలిస్టిక్ మిస్సైల్ లాంఛర్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. ఇరాన్ నేవీని టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతోంది. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేసింది. ఇరాన్ భారీ నౌక మంటల్లో కాలిపోతుంది.
Also Read
- US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Pakistan-China: జిన్పింగ్తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
- Trump-Pakistan: పాకిస్థాన్కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
అమెరికా వైమానిక దళానికి చెందిన B-2 స్టెల్త్ బాంబర్లు ఇటీవల ఇరాన్పై జరిగిన దాడుల్లో ఉపయోగించబడ్డాయని యూనిటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఈ బాంబర్లు అమెరికాలోని వైట్మాన్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి ప్రయాణం ప్రారంభించి సుమారు 37 గంటల రౌండ్-ట్రిప్ మిషన్ను పూర్తి చేసినట్లుగా తెలిపింది. ఈ దాడుల్లో గగనతలంలో ఇంధనం నింపుకునే విధానం కూడా ఉపయోగించినట్లు పేర్కొంది.
మిస్సోరీ రాష్ట్రంలో ఉన్న వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రస్తుతం B-2 స్టెల్త్ బాంబర్లకు ఏకైక కార్యాచరణ కేంద్రంగా ఉంది. అమెరికా స్టెల్త్ దాడి సామర్థ్యంలో ఈ స్థావరం కీలక పాత్ర పోషిస్తోంది. B-2 స్టెల్త్ బాంబర్లను 2022లో అధికారికంగా ఆవిష్కరించారు. అణు, సాధారణ ఆయుధాలను మోసుకెళ్లగలదు. అవసరమైతే సిబ్బంది లేకుండానే పనిచేసే సామర్థ్యం కూడా దీనికి ఉంటుందని అధికారులు తెలిపారు.
అమెరికా సెనెట్ ఆమోదించిన తాజా నిధుల బిల్లులో B-21 రైడర్ ప్రాజెక్ట్ కోసం సుమారు 1.92 బిలియన్ డాలర్లు కేటాయించారు. సెనేటర్ కార్యాలయం తెలిపిన ప్రకారం.. భవిష్యత్తులో ఈ కొత్త బాంబర్లు కూడా వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్లోనే ఉండే అవకాశం ఉంది. అదే బిల్లులో సైనిక సిబ్బందికి 3.8 శాతం వేతన పెంపు కూడా ప్రకటించారు.
గత సంవత్సరం ఇరాన్పై జరిగిన దాడిలో B-2 బాంబర్లు ఇరాన్ అణు స్థావరాలపై 30,000 పౌండ్ల బరువైన బంకర్ బస్టర్ బాంబులను వదిలినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. భూమి లోతుల్లో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇవి ఉపయోగిస్తారు. అమెరికా వైమానిక దళం తెలిపిన ప్రకారం.. మొదటి కార్యాచరణకు సిద్ధమైన B-21 రైడర్ బాంబర్ 2027 నాటికి సేవల్లోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
-
US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
-
బండోడి ట్యూన్కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!