కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపచ దేశాలను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాలపై విరుచుకుపడుతోంది.. మరికొన్ని దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బకు థర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్ కూడా వచ్చేసింది.. దీంతో ఆంక్షల బాట పడుతున్నాయి అన్ని దేశాలు.. మరోవైపు.. కరోనా ఫస్ట్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్.. ఒమైక్రాన్ మాత్రం ఇంకా ఎంటర్ కానీలేదు.. అయితే, ఒక వేళ ఒమిక్రాన్ వచ్చినా లాక్డౌన్కు వెళ్లేది లేదంటున్నారు…
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్ను వారి సొంతగడ్డపైనే ఓడించింది. విదేశాల్లో తొలిసారిగా టెస్టుల్లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. Read Also: సామాన్యుడిపై మరో భారం… పెరిగిన సిమెంట్ ధరలు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 328 పరుగులు చేయగా.. కివీస్ బౌలర్లను…
ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్లతో క్రేజ్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ కొత్తగా క్రీడాభిమానులకు గాలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ ప్రైమ్లో తొలిసారిగా క్రికెట్ లైవ్ ప్రారంభమైంది. శనివారం నాడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట అమెజాన్ ప్రైమ్లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీ ఛానళ్ల జోలికి వెళ్లకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా క్రికెట్ను వీక్షిస్తున్నారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ…
భారత్ లో మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర ఘడియలు రానుండగా, 2022 ఏడాదికి పసిఫిక్ ద్వీప దేశాలు ప్రపంచంలో అందరికంటే ముందు స్వాగతం పలికాయి. పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా దీవి ప్రపంచంలో అందరికన్నా ముందు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించింది. టోంగా, కిరిబాటి దీవులతో పాటు న్యూజిలాండ్ కూడా 2022కు ఘనంగా స్వాగతం పలికింది. Read Also:APSRTC ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుక న్యూజిలాండ్ లోని పలు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి. రంగురంగుల బాణసంచా వెలుగులతో…
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్-5లో ఉన్నాయి. Read Also: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం మరోవైపు…
రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.ఈ రెండో టెస్టులో ఏకంగా 372 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు.. కేవలం 165 పరుగులకే ఆలౌట్ కావడంతో.. టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో…1-0 తేడాతో టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. కాగా మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో 276 పరుగులు…
ఇండియా తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈరోజు టీం ఇండియా 325 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టును మొదట సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు. టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్ ముగ్గురిని త్వరగా ఔట్ చేసాడు. ఆ తర్వాత ముగిలిన బౌలర్లు కూడా తమ పని ప్రారంభించారు. ఆ వెంటనే…
ఇండియా న్యుజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభమైన బిషయం తెలిసిందే. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 221 పరుగులు చేసిన భారత జట్టు ఈరోజు 325 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. అయితే అంతరం బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు మన భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ రెండో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు కేవలం 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అందులో…
ముంబై టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఓ టెస్టు ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా అజాజ్ పటేల్ చరిత్రకెక్కాడు. గతంలో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై 10కి 10 వికెట్లు సాధించగా.. 1999లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్థాన్పై ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ మళ్లీ ఆ ఘనత సాధించి మూడో…
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత మూడు రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు పిచ్, అవుట్ ఫీల్డ్ తడిగా మారాయి. ఈ క్రమంలో అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. ఆటకు అనువుగా లేకపోవడంతో టాస్ను కాసేపు వాయిదా వేశారు. గ్రౌండ్ సిబ్బంది, అంపైర్లు ఉ.9:30గంటలకు మరోసారి మైదానాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాతే టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ సుమారు 30 నిమిషాల…